దిక్కుతోచని స్థితిలో అఖిల్ ముద్దుగుమ్మ

Update: 2016-11-16 15:53 GMT

చిన్న స్థాయి చిత్రాలలో గుర్తింపు తెచ్చుకున్నాక కాని పెద్ద దర్శకులు, హీరోలు, లేక నట వారసుల పరిచయ చిత్రాలలో నటించే అవకాశం దక్కదు చాలా మంది కథానాయికలకు. కొందరికి మాత్రం వెండి తెర పై తొలి అవకాశమే క్రేజీ ప్రాజెక్ట్స్ లలో వస్తుంది. అలాంటి వారిలో సాయేషా సైగల్ కూడా ఒకరు. తనకు వెండి తెర పై తొలి అవకాశమే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, అందులోనూ అక్కినేని నాగేశ్వర రావు మూడో తరంలో వస్తున్నా నట వారసుడు అక్కినేని అఖిల్ పరిచయ చిత్రమైన అఖిల్ లో కథానాయికగా దొరకటం చాలా అదృష్టంగా భావించింది సాయేషా సైగల్.

అఖిల్ విడుదల తరువాత ఆ చిత్రం ఘోర పరాజయం చెందటంతో ఇప్పటి వరకు అక్కినేని అఖిల్ మరో చిత్రమేది మొదలు పెట్టకుండా ఆచి తూచి అడుగు వేస్తూ తనకు తగ్గ కథల అన్వేషణలో ఉండగా, సాయేషా సైగల్ మాత్రం బాలీవడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కించుకుంది. అదే అజయ్ దేవగన్ దర్శక నిర్మాణంలో అజయ్ దేవగన్ సరసన నటించిన శివాయ. భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం కూడా పరాజయం పొందటంతో ఎం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది సాయేషా సైగల్. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ రెండు చోట్ల ఎంట్రీ ఫెయిల్ అవటంతో తన కోలీవుడ్ ఎంట్రీ ఫిలిం కుమారి కందం పైనే ఆశలన్నీ పెట్టుకుంది సాయేషా సైగల్.

Similar News