దటీజ్ ప్రభాస్?

దటీజ్ ప్రభాస్ ఎందుకంటే.. కరోనా లాక్ డౌన్ లో కనీసం బర్త్ డే లుక్స్ ని కూడా అభిమానులకు అందించలేకపోతున్న స్టార్ హీరోల ముందు ప్రభాస్ ఏకంగా [more]

Update: 2020-08-21 02:38 GMT

దటీజ్ ప్రభాస్ ఎందుకంటే.. కరోనా లాక్ డౌన్ లో కనీసం బర్త్ డే లుక్స్ ని కూడా అభిమానులకు అందించలేకపోతున్న స్టార్ హీరోల ముందు ప్రభాస్ ఏకంగా సినిమాల లుక్స్ దగ్గరనుండి.. సినిమాగాల ప్రకటనల వరకు ఈ లాక్ డౌన్ సమయాన్ని బ్రహ్మాండంగా వాడేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో సినిమా కోసమా చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఈసారి అసలు గ్యాప్ రానివ్వడం లేదు. కరోనా లాక్ డౌన్ ప్రభాస్ కి బాగా కలిసొచ్చినట్టుగా ఉంది. కథలను వింటూ ఫైనల్ చేస్తూ వెంటనే అధికారిక ప్రకటనలు ఇప్పించేస్తున్నాడు.

రాధాకృష్ణ మూవీ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ఏమిటో అనుకునేలోపు అందరికి షాకిస్తూ నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ మూవీని పాన్ ఇండియా లెవల్ కి ప్రకటించాడు. అబ్బా అనగానే కొత్తగా డైరెక్ట్ బాలీవుడ్ దర్శకనిర్మాతలతో ప్రభాస్ తన నెక్స్ట్ మూవీ ఆది పురుష్ ని ప్రకటించాడు. ఏకంగా మూడు వందల కోట్లతో తెరకెక్కబోయే ఈ సినిమా పాన్ ఇండియా లేవల్లోనే తెరకెక్కుతుంది. ప్రభాస్ టార్గెట్ పాన్ ఇండియానే. అందుకే సౌత్ డైరెక్టర్స్ చెప్పిన కథలకు ప్రభాస్ టెంప్ట్ అవ్వకుండా అన్ని పాన్ ఇండియా లెవల్ మూవీస్ నే దింపుతున్నాడు. కరోనా టైం లో అందరూ సైలెంట్ గా ఉంటె ప్రభాస్ మాత్రం సినెమా ల మీద సినిమాలు ప్రకటించడంతో.. ఈ లాక్ డౌన్ హీరో ప్రభాస్ అంటున్నారు. లాక్ డౌన్ ని పర్ఫెక్ట్ గా వాడిన హీరో ప్రభాస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

Tags:    

Similar News