తెలుగు చిత్ర పరిశ్రమ తనని దూరం పెట్టిందట

Update: 2016-12-23 05:25 GMT

2006 సంక్రాంతి పండుగకి విడుదలైన దేవదాస్ చిత్రంతో వెండి తెరకు పరిచయం ఐయింది కథానాయిక ఇలియానా. తన రెండవ చిత్రంతోనే మహేష్ బాబు సరసన నటించేసి ఇండస్ట్రీ హిట్ ఐన పోకిరి చిత్రంలో భాగం ఐయింది. అనతి కాలంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, ప్రభాస్, రవి తేజ వంటి పెద్ద హీరోల సరసన నటించేసిన ఇలియానా కెరీర్ పీక్ స్టేజి ఉండగానే తన మకాం హైద్రాబాద్ నుంచి బొంబాయి కి మార్చేసింది. బాలీవుడ్ లో కూడా బర్ఫీ, రుస్తుం వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో బాద్షాహో, ముబారకన్ చిత్రాలలో నటిస్తుంది తప్పితే దక్షిణాది నుంచి ఒక్క అవకాశం కూడా అమ్మడిని పలుకరించటం లేదు.

ఇలియానా వెండితెరకు పరిచయమై రానున్న సంక్రాంతికి 11 సంవత్సరాలు పూర్తి కావొస్తున్నా తొలి నాళ్ళల్లో ఎంతటి నాజూకు అందాలతో ప్రేక్షకులను మెప్పించిందో నేటికీ కూడా తన ఫీజిక్ ని అలానే మైంటైన్ చేస్తుంది. తెలుగు లో చిత్రాలు చేసిన కాలంలో ఏడాదికి మూడు చిత్రాలతో బిజీగా వున్నా ఇలియానా కి ఇప్పుడు బాలీవుడ్ లో ఏడాదికి ఒక చిత్రమే విడుదల అవుతుంది. పైగా ప్రతి చిత్రంలో ఇలియానాకి పూర్తి నిడివి వున్నా పాత్ర దక్కుతుంది అన్న నమ్మకం కూడా లేదు. అందుకే తిరిగి తెలుగు సినిమా అవకాశాల వేట మొదలుపెట్టింది ఇలియానా. కానీ అమ్మడి ప్రయత్నాలు ఫలించటం లేదు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తనకు ఎదురు అవుతున్న గడ్డు పరిస్థితి వివరిస్తూ, "ఈ మధ్యన తెలుగు నుంచి నాకు ఒక్క అవకాశం కూడా దక్కటం లేదు. నన్ను తెలుగు సినిమా దూరం పెట్టిందేమో అనిపిస్తుంది. అయితే ఇటీవల ఒక తెలుగు చిత్ర దర్శకుడు వచ్చి ఒక కథ చెప్పి వెళ్లారు. కాల్ షీట్స్ గురిఞ్చి తరువాత చాల కలం అసలు చర్చే రాలేదు. తీరా చూస్తే ఆ సినిమా వేరే హీరోయిన్ తో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుతున్నారు. నేను ఆ దర్శకుడికి ఫోన్ చేస్తే సారీ చెప్పి పెట్టేసాడు. కానీ ఈ అవకాశం చేజారిపోయిందని అని నా ప్రయత్నాలు మానుకోలేదు. తెలుగులో సరైన చిత్రంతో నా బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్ గా ఇస్తాను." అంటూ విచారిస్తూనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఇలియానా.

Similar News