తిరిగి విలన్ అవతారం ఎత్తుతున్న సీనియర్ హీరో

Update: 2017-04-19 11:37 GMT

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వున్నా ప్రతినాయకులని బాగా స్టైలిష్ గా చూపించటం లేదా పొరుగు రాష్ట్రాలల స్టార్ ఇమేజ్ వున్నా హీరోలని ఇక్కడ స్టైలిష్ విలన్స్ గా మార్చటం, అది కాకపోతే సాఫ్ట్ హీరో ఇమేజ్ వున్నా సీనియర్ హీరోస్ ని రఫ్ లుక్స్ తో విలన్ గా ఎలివేట్ చేయటం అనే ట్రెండ్ బాగా జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను తన గత రెండు చిత్రాలాల్తో రెండు వైవిధ్యమైన ట్రెండ్స్ తీసుకువచ్చాడు. లెజెండ్ చిత్రంతో జగపతి బాబు ని విలన్గా మార్చిన బోయపాటి సరైనోడు చిత్రంతో తమిళ హీరో ఆది పినిశెట్టి ని ప్రతినాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ కావటంతో ఈ ట్రెండ్ బాగా క్రేజీ గా మారిపోయింది.

ఫామిలీ ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ వున్న మరో సీనియర్ హీరో శ్రీకాంత్ ఇప్పుడు ప్రతినాయకుడి అవతారం ఎత్తబోతున్నాడు. గత కొంత కాలంగా హుందా పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు ఎం.కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య నటించబోతున్న చిత్రంలో విలన్ గా నటించబోతున్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న కన్నడ చిత్రం కోసం తన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కి బాగా చేంజ్ ఓవర్ చూపించిన శ్రీకాంత్ తెలుగు సినిమాలలో విలన్గానే తన కెరీర్ ప్రారంభించాడు. అనంతరం తాజ్ మహల్ చిత్రం తో హీరోగా తొలి బ్రేక్ అందుకున్నాడు శ్రీకాంత్. ఇంత కాలానికి తిరిగి విలన్ పాత్రతో ప్రేక్షకులని అలరించబోతున్నాడు.

Similar News