తలలు నరికేస్తామంటున్నారు!!

Update: 2017-11-17 13:09 GMT

పద్మావతి’ చిత్రం పై వివాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇటీవల రాజస్థాన్ లోని కోటాలో ఒక థియేటర్ ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు పద్మావతి చిత్ర విడుదల రోజున భారత్ బంద్ ను ప్రకటించారు.

తప్పుగా చూపారంటూ...

ఇప్పుడు తాజాగా మీరట్ కు చెందిన అఖిల్ భారత క్షత్రియ యువ మహాసభ జాతీయ అధ్యక్షుడు ఠాకూర్ అభిషేక్ సోమ్ పద్మావతి చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పద్మావతి వివాదం పై మాట్లాడిన అతడు 'దీపికా పదుకొణె , సంజయ్ లీల భన్సాలీ తల నరికి తెచ్చినవారికి 5కోట్ల రూపాయలు నగదు బహుమతి ఇస్తాను. రాణి పద్మావతి తనతో సహా మరో 12,000మంది మహిళలతో ప్రాణ త్యాగం చేసింది. కానీ సంజయ్ లీల భన్సాలీ ఈ చిత్రంలో పద్మావతిని తప్పుగా చూపించారు. దాన్ని మేము ఒప్పుకోము. వాళ్లిద్దరూ దేశాన్ని వదిలి వెళ్ళాలి లేదా వారి తలలను నరికేస్తాము. వారి తలను ఎవరూ నరకలేకపోతే నేనే స్వయంగా నరుకుతాను.నేను ఎవరికీ భయపడను. చివరికి పోలీసులకు కూడా.. దీనికోసం నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం' అని అన్నాడు.

భద్రత పెంపు...

మరో వైపు పద్మావతి పాత్రధారి దీపికా పదుకొణె పై వస్తున్న వరుస బెదిరంపుల కారణంగా ముంబయిలోని ఆమె ఇంటి వద్ద, ఆఫీస్ వద్ద పాటిస్తా భద్రతను ఏర్పాటు చేసింది ముంబయి పోలీస్ శాఖ.

Similar News