తండ్రి కూతుళ్ళ కథ!

Update: 2017-12-31 07:54 GMT

సినిమా మొత్తం తండ్రి కూతుళ్ల మధ్య తిరగడం అంటే కథ మీద ఎంత నమ్మకం వుండాలి. దాని డీల్ చేసే డైరెక్టర్ కి ఎంత సత్తా ఉండాలి. అటువంటి సబ్జెక్టు లోనే సీనియర్ హీరో మోహన్ బాబు నటిస్తున్నాడు. మోహన్ బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆయన యంగ్ క్యారెక్టర్ గా మంచు విష్ణు కనిపిస్తాడు.

గాయత్రీ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. మోహన్ బాబు విలన్ గా మరో క్యారెక్టర్ కూడా పోషిస్తున్నారు. డైరెక్టర్ మదన్ పూర్తిగా మానవ సంబందాలు, భావోద్వేగాలతో సాగే మాంచి కథను రెడీ చేసారట. హీరోయిన్ పక్కన హీరో కూడా వుండడని తెలుస్తోంది.

మరి కేవలం తండ్రి, కూతుళ్లు, విలన్ మధ్యనే సినిమా నడుస్తుందట. ఆ నలుగురు, పెళ్లయిన కొత్తలో సినిమాల్లో ఎలా అయితే మంచి మానవ సంబంధాలను తెరమీదకు తెచ్చాడో, అలానే ఈ సినిమాను కూడా హైలైట్ చేస్తూ కథ రాసుకున్నాడట డైరక్టర్ మదన్.

Similar News