డూప్ వద్దంట... తానే చేసేస్తాడట

Update: 2017-10-31 12:00 GMT

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సాహో'. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ , ప్రమోద్ 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ టీజర్ ని విడుదల చేసినప్పుడే సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటివలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో అందరి అంచనాలు రెట్టింపయ్యాయి.

ఈ సినిమా మొత్తం హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా మొత్తం భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ యాక్షన్ సన్నివేశాలన్నిటిని ని ప్రభాస్ ఎటువంటి డూప్ లేకుండా చేస్తున్నాడట. దాంతో చిత్ర బృందం హాలీవుడ్ నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లని పిలిపించారట. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ల ఆధ్వర్యంలో ప్రభాస్ ఈ యాక్షన్ సీన్స్ చేస్తున్నాడట. అయితే ఈ విషయంలో డైరెక్టర్ సుజిత్ మాత్రం కాస్త కంగారుగా ఉన్నాడట. కారణం గతంలో 'బాహుబలి 2' సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు ప్రభాస్ కొద్దిగా గాయపడిన విషయం తెలిసిందే.

అందుకే సాహి చిత్రంలో ప్రభాస్ ని ఈ యాక్షన్ సన్నివేశాలను డూప్ తో చేయించెదమనుకుంటే.... ప్రభాస్ మాత్రం డూప్ లేకుండానే యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్ చేస్తాను అని అంటున్నాడట. ఇంకా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.... నీల్ నితిన్ ముకేష్ విలన్ గా నటిస్తున్నాడు. శంకర్ ఎసాన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లో మందిరా బేడి, చుంకి పాండే, అరుణ్ విజయ్ ,జాకి జ్రాఫ్ వంటి హేమ హేమీలు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Similar News