ట్రైలర్ తోనే సినిమా స్టామినా తెలుస్తుందా..?

Update: 2017-06-29 07:00 GMT

గోపీచంద్ - సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కతున్న 'గౌతమ్ నందా' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. 'బెంగాల్ టైగర్' తో మంచి జోష్ మీదున్న సంపత్ నంది, గోపీచంద్ హీరోగా హన్సిక, కేథరిన్ లు హీరోయిన్స్ గా ఈ 'గౌతమ్ నందాని' తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని తెలుస్తుంది. ఇప్పటికే గోపీచంద్ లుక్, హన్సిక, కేథరిన్ ల లుక్ లు బాగా ఆకట్టుకున్నాయి. అలాగే 'గౌతమ్ నంద' టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాకపోతే ఇప్పుడు చిత్ర యూనిట్ కి ఒక టెన్షన్ పట్టుకుందట. ఎందుకంటే గోపీచంద్ గత చిత్రం 'ఆరడుగుల బుల్లెట్టు' బడ్జెట్ ప్రాబ్లెమ్ వల్ల విడుదల కాకుండా ఆగిపోవడంతో గోపీచంద్ మార్కెట్ బాగా డల్ అవడంతో ఇప్పుడు 'గౌతం నందా' చిత్రానికి ఎలాంటి టాక్ స్ప్రెడ్ అవుతుందో అని కొంచెం కంగారుగా వున్నారని అంటున్నారు. మరోపక్క 'గౌతమ్ నంద' స్టిల్స్ లో హన్సిక, గోపీచంద్, కేథరిన్ లను చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సాధిస్తుందనే అనుకోవచ్చు. అలాగే 'రచ్చ, బెంగాల్ టైగర్' వంటి హిట్స్ ఉన్న సంపత్ నందికి చెప్పుకునేంత సూపర్ హిట్ లేకపోవడం కూడా కాస్త ఆందోళన కలిగించే విషయమే అంటున్నారు.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో సినిమాకి సంబందించిన పబ్లిసిటీ మీద ఫోకస్ చేసింది చిత్ర యూనిట్. అందులో భాగంగానే ఇప్పుడు 'గౌతమ్ నంద' ట్రయిలర్ ని రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరి ట్రైలర్ ని చూస్తే సినిమా స్టామినా ఏమిటనేది స్పష్టంగా అర్ధమవుతుందని అంటున్నారు. ఆందుకే ట్రైలర్ విషయంలో చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని టాక్ వినబడుతుంది.

Similar News