టీ టీమ్ గట్టెక్కిస్తుందా ?

Update: 2016-03-02 15:22 GMT

ఫ్లాప్ ల ఫోబియాలో ఉన్న మంచు ఫ్యామిలికీ మార్చి 4న మరో పరీక్ష ఎదురుకానుంది. మంచు మనోజ్ 'శౌర్య' విడుదలకానుంది. వరుస ఫ్లాపు ల్లో ఉన్న మనోజ్ గట్టెక్కుతాడా లేదాని మంచు ఫ్యామిలీలో టెన్షన్ గా ఉందని ప్రచారం జరుగుతోంది. హిట్ కోసం మనోజ్ ఈ సారి టీ (తెలంగాణ) టీమ్ తో 'శౌర్య' సినిమా చేస్తున్నాడు. చిత్ర దర్శక, నిర్మాత, సంగీత దర్శకుడు టీకి చెందినవారే. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు కొందరు ఉద్యమకారులు మనోజ్ నటిస్తున్న 'ఝమ్మందినాదం' చిత్ర యూనిట్ పై దాడి చేశారు. అప్పుడు మోహన్ బాబు తీవ్రంగా స్పందించారు. ఈ విషయం కొందరికి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతానికి వస్తే సక్సెస్ కోసం మనోజ్ టీ టీమ్ నే నమ్ముకున్నారు.

Similar News