జాన్వీ సినిమా పట్టాలెక్కేస్తుందోచ్

Update: 2017-11-07 13:00 GMT

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకొస్తుందా అని బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు శ్రీదేవి అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు. అదిగో.. ఇదిగో.. అంటున్నారే గాని జాన్వీ మాత్రం సినీ అరంగేట్రం చేయడంలేదు. నటనలో, డాన్స్ లలో శిక్షణ తీసుకుంటుందంటున్నారు. అలాగే బాలీవుడ్ లో ఏ పార్టీలో చూసినా జాన్వీ కపూర్ ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్స్ ఇలా అన్నిటిలో కనబడుతున్న జాన్వీ బాలీవుడ్ అరంగేట్రానికి రెడీ అయ్యిందనే టాక్ వినబడుతుంది. ఇంతకుముందే జాన్వీ కపూర్ ని బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడనే టాక్ ఉంది.

అది కూడా చాల తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి కోట్లు కొల్లగొట్టిన మరాఠీ హిట్ ఫిల్మ్ సైరత్ సినిమాని బాలీవుడ్ లో జాహ్నవి హీరోయిన్ గా రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. ఈ వార్తలొచ్చి కూడా దాదాపు రెండేళ్లు పైనే అయ్యింది. అయితే ఇప్పుడు తాజాగా మరాఠీ ఫిల్మ్ సైరత్ ని కరణ్ జోహార్ తన ఓన్ బ్యానర్ లో శాంక్ ఖైతేన్ డైరెక్టర్ గా శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా.. షాహిద్‌కపూర్ బ్రదర్ ఇషాన్ ఖట్టర్ హీరోగా రీమేక్ చేయబోతున్నాడట. అయితే ఈ రీమేక్ లో జాహ్నవి కి జోడిగా ఇంతకుముందు షారుఖ్ కొడుకు ఆర్యన్‌ ని తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం జాహ్నవికి జోడిగా షాహిద్‌కపూర్ బ్రదర్ ఇషాన్ ఖట్టర్ ఓకే చేశారని చెబుతున్నారు.

ఇకపోతే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పూర్తిచేసుకుని.. అలాగే ప్రి ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ మీదకెళ్ళబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి ఇప్పటికి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సినిమా పట్టాలెక్కుతుందన్నమాట.

Similar News