చెర్రీ దర్శకులకే చిరు అవకాశాలా?

Update: 2018-01-27 07:05 GMT

2016 ఆఖరులో విడుదలైన ధ్రువ చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వరుస వైఫల్యాల నుంచి కొంత ఉపశమనం పొందాడు. ఆ చిత్రాన్ని తమిళ మాతృక కి ఏ మాత్రం తీసిపోకుండా స్టైలిష్ గా తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ చిత్రం పొందిన మెప్పునే వారధిగా చేసుకుని మెగా స్టార్ చిరంజీవి 151 వ చిత్రం సైరా నరసింహారెడ్డి కి దర్శకత్వ అవకాశం పొందగలిగారు.

సుకుమార్ కు కూడా....

ధ్రువ విడుదలైన అనంతరం చాలా గ్యాప్ తీసుకుని మేకప్ వేసుకున్న చరణ్ మూస ధోరణిలో సాగే మాస్ కథలతో కాక తననుంచి మాస్ అంశాలని కోరుకునే అభిమానులతో పాటు క్లాస్ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకునేలా సుకుమార్ చెప్పిన కథలో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. తుది దశకి చేరుకున్న ఈ చిత్రం విడుదలకి దగ్గర పడుతుంది. కాగా సురేందర్ రెడ్డి మాదిరి గానే చరణ్ చిత్రంతో మంచి ఔట్ పుట్ ఇచ్చి ఇప్పటికే రషెస్ తో చిరంజీవి ని మెప్పించిన సుక్కు చిరు కోసం ఒక స్టోరీ లైన్ చేసి నేరేషన్ ఇచ్చారని, త్వరలో ఫుల్ నేరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ లాక్ చేసుకుంటారనే వార్త హల్చల్ చేస్తుంది.సుకుమార్ తో మెగా స్టార్ తదుపరి చిత్రం అనే వార్తని పుకారు అని కొట్టిపారేసే వారు ఎంతమంది వున్నారో ఈ వార్త నిజమవ్వాలని కోరుకునే అభిమానుల సంఖ్య కూడా అంతే ఉండటం విశేషం.

Similar News