చిరు మెచ్చిన రంగస్థలం!!

Update: 2017-11-16 17:00 GMT

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 చిత్రం... 1990 లో పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతుంది. ఎప్పుడు క్లాస్ మెచ్చే.. సినిమాలు చేసే సుకుమార్ మొదటిసారి ఇలా పల్లెటూరి నేపథ్యంలోని కథతో రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమంత పెళ్లి వలన కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్ళీ ప్రారంభమైంది. ఈ సినిమాపై అంచనాలే కాదు అమితమైన ఆసక్తిని కనబరుస్తున్నారు... మెగా అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీలోని వారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటివానిగా నటిస్తుండగా.. సమంత పక్కా పల్లెటూరి పడుచు పాత్ర పోషిస్తుంది. అలాగే అనసూయ, అది పినిశెట్టిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

థ్రిల్ అయిన చిరు....

అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న రంగస్థలంలోని కొన్ని సన్నివేశాలతోపాటే... నాలుగు పాటలను కూడా చిత్రీకరణ జరపాల్సి ఉందట. అయితే ఆ షూటింగ్ విషయం అలా ఉంచితే ఇప్పటికి వరకు కంప్లీట్ చేసుకునం రంగస్థలం చిత్ర రషెస్ ని చిరంజీవి వీక్షించాడట. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి చిరంజీవి రంగస్థలం రషెస్ ని స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూశాడట. సుకుమార్ వర్క్ పట్ల చిరు పూర్తి సంతృప్తితో ఉన్నాడట. ఈ రంగస్థలం రషెస్ చూసిన చిరు థ్రిల్ అయ్యాడట. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని సుకుమార్ కి చిరు కితాబునిచ్చినట్లుగా తెలుస్తుంది.

రాజమౌళి అభినందనలు...

అలాగే రంగస్థలం రషెస్ చూసిన రామౌళి కూడా రంగస్థలం చిత్ర బృందాన్ని అభినందించినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ చిత్రం ఒక విజువల్ ట్రీట్ లా నిలుస్తుందని..మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులందరిని...రంగస్థలం అలరిస్తుందని రాజమౌళి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇకమీదట మిగిలిన షూటింగ్ ని కూడా పూర్తి చేసేసి వచ్చే ఏడాది మార్చి కల్లా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవాలని సుకుమార్ అండ్ రామ్ చరణ్ భావిస్తున్నారట.

Similar News