గౌతమ్ నంద పై ఆశ పెంచుకున్న సన్యాసిని

Update: 2016-11-25 07:30 GMT

పూరి జగన్నాథ్ చేసిన ఫుల్ లెంగ్త్ మాస్ మసాలా చిత్రం దేశ ముదురు చిత్రంతో సన్యాసిని పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసిన కథానాయిక హన్సిక మోత్వానీ. తొలి చిత్రమే భారీ విజయం ఐయింది. తరువాత పలు తెలుగు చిత్రాలలో నటించినప్పటికీ రామ్ సరసం నటించిన రెండు చిత్రాలు మస్కా, కందిరీగ మరియు మంచు విష్ణు సరసన నటించిన రెండు చిత్రాలు దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలు మోస్తరు ఫలితాలు తప్ప హన్సిక నిలదొక్కుకునే స్థాయి విజయాలు అందలేదు.

ఆ మధ్య కాలంలో కంత్రి, బిల్లా, జయీభవ, సీతా రాముల కళ్యాణం, ఓహ్ మై ఫ్రెండ్ వంటి వరుస పరాభవాలు ఎదురు అవుతుండటంతో తెలుగు చిత్రాలు తగ్గించి తమిళంలో వస్తున్న వరుస అవకాశాలతో అగ్ర తారగా కోలీవుడ్ లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు సంపత్ నంది ఇచ్చిన అవకాశంతో తెలుగులోనూ గుర్తుండిపోయే కమర్షియల్ సక్సెస్ మరొకటి దొరుకుతుంది అని ఆశ పడుతుంది హన్సిక మోత్వానీ. గోపి చంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న గౌతమ్ నంద చిత్రంలో ఒక కథానాయికగా నటిస్తుంది హన్సిక. మరో కథానాయికగా కాథరిన్ నటిస్తుంది. ఈ చిత్రం 2017 ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Similar News