'గీత గోవిందం` కథ విని పారిపోయిన హీరోయిన్లు..!

Update: 2018-07-30 06:06 GMT

తినే ప్ర‌తి మెతుకుపైనా ఒక‌రి పేరు రాసి పెట్టి ఉంటుంద‌ట‌. అది ఎవ‌రి తినాలో వాళ్లే తింటారని పెద్ద‌లు చెబుతుంటారు. సినిమా ఇండ‌స్ట్రీలో కూడా అంతే. ఏ పాత్ర ఎవ‌రికి రాసి పెట్టి ఉంటుందో వాళ్లే చేస్తుంటారు. కొన్ని పాత్ర‌లు చేతికందిన‌ట్టే అంది జారిపోతుంటాయి. కొంత‌మందికేమో అస‌లు ఊహించని రీతిలో అవ‌కాశాలొచ్చి అవి అందలాన్ని ఎక్కిస్తుంటాయి. 'గీత గోవిందం'లో ర‌ష్మిక న‌టించ‌డం గురించి ఆ చిత్ర‌బృందం ఇదే చెబుతోంది. ఆమెకి రాసి పెట్టి ఉంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మొద‌లుకొని, గెస్ట్‌గా హాజ‌రైన అల్లు అర్జున్ వ‌ర‌కు అంతా అదే చెప్పారు. ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ అయితే ఈ సినిమా హీరోయిన్ సెల‌క్ష‌న్ వెన‌క పెద్ద ర‌ప్చ‌ర్ జ‌రిగింద‌ని ఓపెన్‌గా చెప్పేశాడు. అస‌లు ఏం జ‌రిగింద‌నేదే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అల్లు అర్జున్ కూడా హీరోయిన్ సెల‌క్ష‌న్ గురించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. మామూలుగా ఇండ‌స్ట్రీలో ఉన్న క‌థానాయిక‌ల్లో చాలా మంది ఫ్రెండ్స్‌గా ఉంటారు. వాళ్లు ఎప్పుడైనా మంచి పాత్ర వ‌స్తే మాకు చెప్పు అంటుంటారు. అలా అడిగిన‌వాళ్లంద‌రికీ ఈ సినిమాలోని పాత్ర గురించి చెప్పా. కానీ వాళ్లెవ‌రూ ఈ సినిమా చేయ‌లేదు. ర‌ష్మిక చేసింది. ఆమెకి ఈ సినిమాతో మంచి పేరొస్తుంద''ని చెప్పుకొచ్చాడు. అస‌లు గీతా ఆర్ట్స్‌లాంటి ఒక ప్ర‌ముఖ సంస్థ‌లో హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం వ‌స్తే అంతా ఎగిరి గంతేసేవాళ్లే. మ‌రి ఈ సినిమా విష‌యంలో క‌థానాయిక‌లు ఎందుకంత భ‌య‌ప‌డ్డార‌నేది అర్థం కాని విష‌యం. కథానాయిక పాత్ర బ‌ల‌మైన‌ది కాబ‌ట్టి ర‌క్తిక‌ట్టిస్తామో లేదో అని భ‌య‌ప‌డ్డారా లేదంటే మ‌రే ఇత‌ర కార‌ణమేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.

Similar News