క్రేజీ ప్రాజెక్ట్స్ అవకాశాలు వరిస్తూనే వున్నాయి

Update: 2017-03-07 17:43 GMT

గత ఏడాది ప్రారంభంలో విడుదలైన నేను శైలజ చిత్రంలో శైలజ పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసిన యువ కథానాయిక కీర్తి సురేష్ తరువాత కొద్దీ నెలలకే తాను తమిళం లో నటించిన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మందికి కూడా వచ్చింది. ధనుష్ సరసన నటించిన రైల్ మరియు శివ కార్తికేయన్ సరసన నటించిన రెమో వంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ నేను శైలజ తో చేసిన మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయింది కీర్తి సురేష్. కానీ ఈ ఏడాది తాను నటించిన మరో స్ట్రెయిట్ తెలుగు చియాత్రం నేను లోకల్ తో అనూహ్యమైన విజయం అందుకుని స్టార్ హీరోల సరసన కథానాయికగా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.

అయితే నేను లోకల్ సినిమాలో నాచురల్ స్టార్ నాని సరసన నటించిన కీర్తి సురేష్ తన తొలి చిత్రంతో పోలిస్తే బాగా బరువు పెరిగిపోయినట్టు వెండితెరపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే గ్లామర్ షో కి ఏ మాత్రం అవకాశం లేని సినిమా కావటంతో నేను లోకల్ చిత్రంలో కీర్తి సురేష్ ప్రెజన్స్ ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదు. కానీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించనుండటంతో కీర్తి సురేష్ వర్క్ ఔట్స్ చేస్తూ తన శరీర బరువుని తగ్గించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందట. అయితే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్ పేరు పరిశీలనలో వుంది.

ఇప్పుడు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీ వాస్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో ముఖ్య కథానాయికగా కీర్తి సురేష్ ఎంపికైనట్టు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం శృతి హాసన్ తో సంప్రదింపులు జరిపినప్పటికీ తన నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటంతో కీర్తి సురేష్ ని ఆ పాత్ర కి ఫైనల్ చేశారు.

Similar News