కోలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న తెలుగు యాంకర్

Update: 2016-10-24 09:36 GMT

తక్కువ వ్యయంతో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన క్షణం చిత్రం కొత్త తరహా కథనం తో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే పొందింది. ఆ చిత్ర నిర్మాణంలో భాగస్వామి ఐన ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా కి అదే తొలి విజయం. అడవి శేషు అందించిన కథ కథనాలు క్షణం చిత్రానికి ప్రధాన బలం గా నిలవగా, అదా శర్మ కథానాయికగా నటించింది. అందులోని లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రముఖ బుల్లి తెర యంచోర్ అనసూయ కనిపించింది. ఆ చిత్రంలో అనసూయాది కథానుసారం చాలా కీలకమైన పాత్ర.

ఇప్పుడు క్షణం చిత్రాన్ని తమిళంలో నిర్మించబోతున్నారు. తెలుగు లో అడవి శేషు పోషించిన పాత్రను అక్కడ శిబి సత్యరాజ్ పోషించనున్నారు. కొంత కాలంగా హీరోయిన్ ఎంపికలో జాప్యం కనిపించింది కానీ చాలా పేర్ల పరిశీలన తరువాత అదా శర్మ పాత్రను తమిళంలోనూ తనకే ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రను అయితే వేరే నటుల ప్రాస్తావన కూడా లేకుండా నేరుగా అనసూయ నే సంప్రదించారు అంట. అనసూయ కూడా తమిళంలో నిరూపించుకునే అవకాశం దక్కటంతో వెంటనే అంగీకరించింది.

ఒకప్పుడు బుల్లి తెర కే పరిమితమవుతానని చెప్పి త్రివిక్రమ్ అత్తారింటికి దారేది లో పవర్ స్టార్ తో చిందేసే అవకాశం ఇచ్చినా కాదనుకున్న అనసూయ క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో వెండి తెర పై కూడా అలరించి ఇప్పుడు తమిళ చిత్ర అవకాశం కూడా కొట్టేసింది. చూద్దాం కోలీవుడ్ నుంచి ఇంకెటు వెళ్తుందో...

Similar News