కొత్త సంపాదన మార్గం వెతుకున్న స్టార్ హీరోయిన్

Update: 2017-03-22 15:23 GMT

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానంలో వున్న కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, తారక్ వంటి స్టార్ హీరోస్ సరసన యాక్ట్ చేసిన రకుల్ ప్రస్తుతం మహేష్ బాబు సరసన నటిస్తోంది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న రకుల్ తన క్రేజ్ కి తగ్గట్టుగానే పారితోషికాల పెంపు కూడా వేణు వెంటనే చేస్తోంది. సినిమాలతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రాధాన్యం ఇవ్వాలంటూ జిమ్ వ్యాపారం పలు నగరాలలో ప్రారంభించిన రకుల్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ హాజరు అవుతూ అలా కూడా సంపాదిస్తుంది. అయితే ఇవన్నీ ఎంతోకొంత శ్రమించాల్సిన కార్యాలు. కానీ ఇప్పుడు రకుల్ అన్వేషించిన సరికొత్త సంపాదన మార్గం మాత్రం ఏ మాత్రం కష్టపడకుండా ఒక్క ట్వీట్ తో పైసా వసూళ్లు వ్యాపారం.

సోషల్ మీడియా ప్రభావం ఉధృతంగా పెరిగిపోవటంతో ఆధునిక సాంకేతికతతో తమ ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేసే ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తి ప్రచారానికి సోషల్ మీడియా నే నమ్ముకుంటున్నారు. అందులోనూ ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాటుఫామ్ పై సినిమా సెలబ్రిటీస్ కి అత్యధిక సంఖ్యలో ఫాలోయర్స్ ఉంటుంటారు. అందుకే వారి చేత తమ ఉత్పత్తి గురించి ట్వీట్ చూపిస్తే ఎక్కువ మంది జనానికి రీచ్ అవుతుందని నమ్ముతున్నాయి వాణిజ్య సంస్థలు. అందుకే ఒప్పో 3 ప్లస్ అనే మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి చేసే సంస్థ రకుల్ చేత తమ మొబైల్ లో సెల్ఫీ కెమెరా నైపుణ్యత గురించి ఒక ట్వీట్ మరియు రెండు సెల్ఫీ లు పోస్ట్ చెఇంచుకున్నారు. ఇందుకు గానూ సదరు సెల్ ఫోన్ కంపెనీ సంస్థ రకుల్ ప్రీత్ సింగ్ కు పెద్ద మొత్తంలోనే సమర్పించుకుంది. తన క్యారవాన్ లో ఒక సెల్ఫీ దిగిన రకుల్, కొంత మంది మగ పిల్లలతో సెల్ఫీ దిగి ఈ ఫోన్ తనతోపాటు ఆ పిల్లలకి సెల్ఫీ దిగటానికి బాగా అనువుగా ఉందని ట్వీట్ చేసింది.

For selfie n group selfie #OPPOF3Plus has dual selfie camera.Kids n I love it n u?? #SelfieExpert @oppomobileindia

Similar News