కింగ్ నిర్మాణంలో ఈ కుర్ర హీరో మరోసారి నటిస్తున్నాడు

Update: 2017-02-27 08:53 GMT

2013 డిసెంబర్ నెలలో అతి చిన్న సినిమాగా విడుదలై కుటుంబ ప్రేక్షకుల ఆదరాభిమానాలతో అద్భుతమైన విజయాన్ని అందుకోవటమే కాకుండా 2014 జనవరి నెలలో విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఎవడు చిత్రాల పోటీని తట్టుకుని కూడా దిగ్విజయంగా 50 రోజుల ప్రదర్శనలు పూర్తిచేసుకుంది ఉయ్యాలా జంపాల చిత్రం. ఈ చిత్రంతో వెండితెరకు కథానాయకుడిగా పరిచయమైన రాజ్ తరుణ్ తొలి ప్రయత్నంతోనే ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడంలో ఆ చిత్ర ప్రొమోషన్స్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పాత్ర ఎంతో వుంది. తరువాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమా చూపిస్త మామ చిత్రం సూపర్ హిట్ కావటానికి కూడా ఉయ్యాలా జంపాల క్రేజ్ బాగా ఉపయోగపడింది.

తొలి చిత్రంతో అంతటి బ్రేక్ ఇచ్చిన నిర్మాతల్లో ఒకరైన అక్కినేని నాగార్జున నిర్మాణంలో యువ హీరో రాజ్ తరుణ్ మరో చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. రంజని అనే దర్శకురాలు ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. చిన్న బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా గ్రాండ్ రిలీజ్ అయ్యి రాజ్ తరుణ్ కి మరో అద్భుతమైన విజయం అందిస్తుందని ట్రేడ్ టాక్. ఈ శుక్రవారం కిట్టు వున్నాడు జాగ్రత్త చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు రాజ్ తరుణ్.

Similar News