కావాల్సిన వారికే నందులు!!

Update: 2017-11-15 14:00 GMT

గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు ఇద్దరు రెండు కళ్ళు వంటి వారు. అప్పటికి ఇప్పటికి వారిద్దరికీ ఉన్న విలువే వేరు. ఎన్టీఆర్ ఎలా సినిమాల్లో నటిస్తూనే కన్నుమూశాడో... ఏఎన్నార్ కూడా సినిమాల్లో నటిస్తూనే కన్ను మూసాడు . మనం సినిమా నాగేశ్వరరావు చివరి సినిమా. ఆ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన నాగార్జున, నాగ చైతన్య , అఖిల్, అక్కినేని నాగేశ్వర రావు నటించారు. ఆ సినిమా అక్కినేని ఫ్యామిలీకి ఎంత స్పెషలో... తెలుగు సినిమా పరిశ్రమకి కూడా అంటే స్పెషల్. ఇలా మూడు తరం హీరోలు ఒకే సినిమాలో కనబడి అభిమానులనేకాదు తెలుగు ప్రేక్షకులందరిని ఆనదింపజేశారు.

మనం కు అన్యాయం....

ఒక చక్కటి కథతో తెరకెక్కిన ఈసినిమాకి నందుల విషయంలో అన్యాయం జరిగింది. నిన్న మంగళవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించన నంది అవార్డులలో మనం సినిమాకి అన్యాయం జరిగిందని ముక్తకంఠం తో చెప్పాలి. నంది అవార్డులలో నందులను గెలుచుకున్న సినిమాలలో మనం సినిమా కూడా ఉండాలి. అయినా మనం సినిమాకి గాని దర్శకుడికి గాని నంది రాలేదు. మిగతా చాలా చిత్రాలకు నంది బహుమతులు వచ్చేసాయి. ఇప్పటికే నంది అవార్డుల విషయంలో రచ్చ మొదలైంది. కమ్మ కులాన్ని హైలెట్ చేసి మిగతా వారిని తొక్కేశారని... ఏపీ ప్రభుత్వానికి కావాల్సిన వారికే ఈ నందులు వచ్చాయనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో మిన్నంటింది.

Similar News