కథ నచ్చలేదా?.. హీరో నచ్చలేదా..?

Update: 2017-11-17 12:00 GMT

ఆ మధ్యన ఎప్పుడో నందమూరి - మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం ఏ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఆర్భాటంగా మొదలైంది. సినిమా అయితే మొదలు పెట్టారు గాని ఆఫీషియల్ గా మాత్రం సెట్స్ మీదకెళ్ళలేదు. క్రియేటివ్ కమర్షియల్స్ వారు గ్రాండ్ గా మొదలెట్టిన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలు. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా కథ కంచెకు చేరలేదు. అంటే ఈసినిమా ఆగిపోయింది. ఆ సినిమా గనక మొదలైనప్పుడే పట్టాలెక్కించేస్తే ఈపాటికి విడుదల కూడా అయ్యుండేది.

రీజన్ ఎంటంటే...?

అయితే ఈసినిమా ఆగిపోవడానికి ఒక గట్టి రీజన్ ఉందంటున్నారు. అసలు విషయం ఏమిటంటే నందమూరి కళ్యాణ్ రామ్ ముందు ఈ సినిమాని ఒప్పుకుని తరవాత నో చెప్పడం వలెనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదట. దర్శకుడు రవికుమార్ చౌదరి చెప్పిన కథ కి తొలుత కళ్యాణ్ రామ్ ఓకే చెప్పినప్పటికీ.... ఆ తర్వాత మాత్రం ఆ సినిమా చేయనని చెప్పాడట . అయితే మరో హీరో అయిన సాయి ధరం తేజ్ మాత్రం ఈ సినిమా చెయ్యడానికి తానికే అభ్యంతరాలు లేవని చెప్పాడట. మరి ఒక హీరో ఓకె చెప్పి మరో హీరో నో చెబితే ఇంకా సినిమా ఏం పట్టాలెక్కుతోంది. మరి కేవలం కళ్యాణ్ రామ్ నో చెప్పడం వలెనే మెగా - నందమూరి వారి మల్టీస్టారర్ సినిమా ఆగిపోయింది.

Similar News