ఒక్క షోతో రేంజ్ మారిపోయింది!!

Update: 2017-10-06 12:00 GMT

ఏదైనా సినిమా హిట్ అయితే చాలు అందులోని నటీనటులు తమ పారితోషకాలు అమాంతం పెంచెయ్యడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక రియాలిటీ షో లో పార్టిసిపేట్ చేసిన వారు కూడా తమ పారితోషకాలను డబుల్ చేశారని... తమదగ్గరికి వచ్చి అవకాశాలకోసం మాట్లాడుతున్న వారికి చుక్కలు చూపెడుతూఉన్నారనే టాక్ మొదలైంది. ఈపాటికే ఆ రియాలిటీ షో ఏమిటో మీకు అర్ధమయ్యే ఉంటుంది. అవకాశాలు లేక ఖాళీగా ఉన్న కొద్దిమంది సెలబ్రిటీస్ తో స్టార్ట్ చేసిన బిగ్ బాస్ షో ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా రావడంతో పిచ్చ క్రేజ్ సంపాదించుకుని... మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా ఆదిరిపోయే లెవల్లో పూర్తి చేసుకుంది.

రిబ్బన్ కటింగ్ చేయాలంటే....

ఆ షోలో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న పార్టిసిపేట్స్ కి ఆ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే పిచ్చ క్రేజ్ వచ్చేసింది. వారెక్కడ కనబడినా మీరు బిగ్ బాస్ లో అలా చేశారు ఇలా చేశారు అంటూ జనాలు కూడా మీదడిపోతున్నారు. అందుకే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్స్ ఫిక్స్ అయ్యారు. అర్చన, దీక్షాపంత్, హరితేజ, కత్తి కార్తీక వంటి వాళ్ళు ఇప్పుడు ఏ రిబ్బన్ కటింగ్ కి వెళ్లాలన్నా... టివి ప్రోగ్రామ్స్ చెయ్యాలన్నా తమ పారితోషకాలను డబుల్ చేసి వచ్చినవారికి చుక్కలు చూపించడం మొదలుపెట్టేశారట.

వీళ్ల వల్లేనా లేక......

చిన్న సినిమాల్లో చిన్న పాత్ర వచ్చినా ఆ పాత్రకి అదిరిపోయే రేట్లతో భయపెట్టేస్తున్నారట. అయితే ఇలా భారీ డిమాండ్ చేస్తున్నవారిలో బిగ్ బాస్ నుండి బయటికి వచ్చినవారిలో కొంతమందే ఉన్నారట. మిగతావాళ్ళు తమకి సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే చాలని ఫీల్ అవుతున్నారట. మరి బిగ్ బాస్ షో తమ వలెనే క్రేజ్ వచ్చిందనే భావనలో వీళ్ళు ఉన్నారేమో అంటున్నారు.. అసలు బిగ్ బాస్ కి అంతలా క్రేజ్ రావడానికి కారణం పూర్తిగా ఎన్టీఆర్ అన్న విషయం మాత్రం వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అంటున్నారు.

Similar News