ఏడాది తరువాత అమ్మడి చూపు బాలీవుడ్ పై పడింది

Update: 2017-02-09 04:49 GMT

2016 జనవరి నెలలో విడుదలైన జై గంగాజల్ చిత్రం తరువాత బాలీవుడ్ ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్ర ఇతర ఇండియన్ ఫిలిమ్స్ కి సంతకం చేయలేదు. గత ఏడాది నుంచి హాలీవుడ్ టెలి సిరీస్ క్వాన్టికో లో నటిస్తూ బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా తన మకాం కూడా బొంబాయి నుంచి న్యూయార్క్ కి మార్చేసి అక్కడే నివాసం ఉంటోంది. ఈ ఏడాది కాలంలోనే బేవాచే అనే ఆంగ్ల చిత్రంలోనూ ప్రియాంక చోప్రా నటించింది. ఈ చిత్రం ఇదే ఏడాది మే నెలలో విడుదల కాబోతోంది. 2016 లో జై గంగాజల్ అనంతరం న్యూయార్క్ వెళ్లిపోయిన ప్రియాంక ఈ ఏడాది కాలంలో అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖతో బ్రాండ్ అంబాసడర్ గా కుదుర్చుకున్న ఒప్పొందం కారణంగా ఆ ప్రకటనలలో నటించటానికి మాత్రమే ప్రియాంక ఇండియా విచ్చేసింది తప్ప గత ఏడాది జనవరి నుంచి నేటి వరకు ప్రియాంక చోప్రా ఒక్క బాలీవుడ్ వేడుకకి కూడా హాజరు కాలేదు.

2015 లో విడుదలైన చారిత్రాత్మక చిత్రం బాజీరావు మస్తానీ చిత్రంతో దర్శకుడు సంజయ్ లీల బన్సాలి తో తొలిసారి పనిచేసిన ప్రియాంక చోప్రా ఇప్పుడు మరోసారి బన్సాలి దర్శకత్వంలో పనిచేయటానికి తిరిగి బాలీవుడ్ రానుంది. ప్రస్తుతం దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్న పద్మావతి చిత్రీకరణలో నిమగ్నమైన సంజయ్ లీల బన్సాలి తన తదుపరి చిత్రంగా తాను చదివిన ఒక పుస్తకం ఆధారంగా సినిమా చేయనున్నారట. ఆ చిత్రంలో కథానాయిక పాత్రని ప్రియాంక చోప్రాతోనే నటింపచేయాలని నిశ్చయించుకున్న బన్సాలి తన చిత్రానికి కథ తయారు కానప్పటికీ, ప్రియాంక కి ఆ పుస్తకాన్ని నేరేట్ చేసాడట. బన్సాలి నేరేషన్ కి పూర్తిగా కన్విన్స్ అయిపోయిన ప్రియాంక ఆయన పై వున్న నమ్మకంతో కథ తో రానప్పటికీ బన్సాలి తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. పద్మావతి చిత్రం నుంచి ఫ్రీ ఐన అనంతరం బన్సాలి ప్రియాంక చోప్రా ప్రధాన కథానాయికగా తెరకెక్కించబోయే చిత్రం స్క్రిప్ట్ పై పని చేయనున్నారట.

Similar News