ఇప్పటిదాకా చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150 ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సంబందించిన టెంక్షన్ పడ్డ చిరు, చరణ్ లు ఇప్పుడు మరో విషయం లో టెంక్షన్ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అసలు 'ఖైదీ..' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు విజయవాడలో జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల అనుమతి మంజూరు చేయకపోవడంతో ఆ వేదికని, డేట్ ని కూడా మార్చుకుని గుంటూరు సమీపం లో హయ్ ల్యాండ్ లో ఈ నెల 7 న జరపనిశ్చయించారు. ఇక ఇప్పటిదాకా ఫంక్షన్ కి డేట్, వేదిక గురించిన టెంక్షన్స్ పడగా ఇప్పుడు చరణ్, చిరులు కి పవన్ కళ్యాణ్ టెంక్షన్ మొదలైందని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150 ' ఫంక్షన్ కి గనక ఒకవేళ హాజరు కాకపొతే అక్కడి అంభిమానులతో వేగడం చాలాకష్టమైన పని. ఇప్పటికే పవన్ రాకపోవడం వల్ల చాలా ఫంక్షన్స్ లో పవన్ అభిమానులు మిగతా మెగా హీరోలను మాట్లాడనీయకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక ఏదో అల్లు అర్జున్ అప్పట్లో మెగా ఫ్యాన్స్ కి క్లాస్ పీకినా... కూడా వారిలో ఏ మార్పు రాలేదనేది జగమెరిగిన సత్యం. మరి ఇప్పుడు కూడా అల్లు అరవింద్ దగ్గరనుండి చరణ్ వరకు పవన్ వస్తాడో రాడో..... ఆయన విదేశాల్లో ఉంటే గనక రాకపోవచ్చని మెగా ఫ్యాన్స్ ని ఇప్పటినుండే ప్రిపేర్ చేస్తున్నారు. అసలిప్పటికే పవన్ కి ఇన్విటేషన్ కూడా ఇచ్చానని చెబుతున్నాడు రామ్ చరణ్. ఆయనేం చిన్నపిల్లాడు కాదు.. రావాలనుకుంటే ఆయనే వస్తాడని చరణ్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.
మరి ఒకవేళ పవన్ గనక 'ఖైదీ... 'ఫంక్షన్ కి హాజరవకపోతే అక్కడ ఫ్యాన్స్ ఏం గందరగోళం చేస్తారో అని ఇప్పుడు చిరంజీవికి, రామ్ చరణ్ కి పెద్ద టెంక్షన్ గా ఉందని అంటున్నారు. పవన్ రాకపోతే ఫ్యాన్స్ ఏ మెగా హీరో ని మాట్లాడనివ్వకుండా పవన్, పవన్ అవి అరిచే ప్రమాదం చాలానే ఉందని వారి టెంక్షన్ కాబోలు. మరి వీరిద్దరూ ఏదో విధంగా పవన్ ని ఈ ఫంక్షన్ కి రప్పించగలిగితే వీరు 'ఖైదీ....' పబ్లిసిటీలో సక్సెస్ ని సాధించిన వారవుతారు. లేకుంటే ఏం జరుగుతుందో ఈ నెల 7 వరకు వేచి చూడాలి.