ఉత్తరాది ప్రేక్షకులు ప్రభాస్-కత్రినా ల జోడి చూడాలనుకుంటున్నారు

Update: 2017-05-09 10:24 GMT

2013 లో విడుదలైన మిర్చి వరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితం. మిర్చి విడుదలైన రెండు సంవత్సరాలికి విడుదలైన బాహుబలి ది బిగినింగ్ చూసి ఉత్తరాది ప్రేక్షకులు ప్రభాస్ తమ హీరో అని ఓన్ చేసుకుని బాహుబలి చిత్రానికి ఊహించని రీతిలో వసూళ్లు కురిపించారు, కురిపిస్తున్నారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలలో సినిమా ప్రేక్షకులకి ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లలానే ప్రభాస్ కూడా ఒక అగ్ర హీరోనే. అయితే ఖాన్ల త్రయం తమ ఆధిపత్యం బాలీవుడ్ లో చూపటానికి దశాబ్దాల శ్రమ ఫలితంగా ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. కానీ ప్రభాస్ పడ్డ కష్టమంతా దక్షిణాది ప్రేక్షకులని మరీ ముఖ్యంగా తెలుగు వారి అభిరుచులకు దగ్గరగా తన నటన వుండాలని మాత్రమే. కానీ బాహుబలి అనే ఒక మహత్తరమైన చిత్రం ద్వారా ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా అగ్ర కథానాయకుడి హోదా లో స్టార్ స్టేటస్ సంపాదించేకున్నాడు.

మరి అంత క్రేజ్ వున్న ప్రభాస్ లాంటి స్టార్ ని తమ సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా బాలీవుడ్ వెబ్సైట్ లు వదలవు కదా. ఒక ప్రముఖ వెబ్సైట్ ప్రభాస్ తదుపరి చిత్రంలో అతనితో ఏ హీరోయిన్ జతకట్టాలని మీరు అనుకుంటున్నారు అని ఒక పోల్ నిర్వహించింది. ఈ పోల్ ఫలితాలని బట్టి పరిశీలిస్తే ఉత్తరాది రాష్ట్రాలలోని ప్రభాస్ అభిమానులు అత్యధికంగా 49 శాతం మంది కత్రినా ఖైఫ్ కి మొగ్గు చూపారు. తరువాతి స్థానంలో 36 శాతం మంది అభిమానుల మద్దతు తో దీపికా పదుకొనె, 9 శాతం మంది ప్రభాస్ అభిమానుల మద్దతు తో ప్రియాంక చోప్రా, 4 శాతం మంది అభిమానుల మద్దతు తో కరీనా కపూర్ ఖాన్ ఉండగా గతంలో ఏక్ నిరంజన్ చిత్రానికి గానూ ఆన్ స్క్రీన్ పెయిర్ గా కనిపించిన ప్రభాస్-కంగనా రనౌత్ ల కాంబినేషన్ కి కేవలం 2 శాతం మంది అభిమానులు మాత్రమే మద్దతు పలకటం గమనార్హం.

Similar News