ఈసారి తప్పు చేయడంట

Update: 2017-09-30 12:00 GMT

మొన్నామధ్యన జై లవ కుశ విజయోత్సవ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక పక్కన... తప్పుంటే క్షమించమని చెబుతూనే మరోపక్క సినీ విశ్లేషకులను విమర్శించాడు. ఆ ఆతర్వాత మీడియా కి టార్గెట్ అయ్యాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఇండస్ట్రీలోని కొంతమంది ఎన్టీఆర్ కి ఫెవర్ గా విమర్శకులపై ద్వజెత్తారు. కానీ కొంతమంది మాత్రం విమర్శకుల తప్పులేదన్నారు. అయినా ఎన్టీఆర్ ని మీడియా మిత్రులు చీల్చి చెండాడేశారు. కేవలం తన సొంత సినిమా కాబట్టే ఎన్టీఆర్ ఎన్నడూలేనట్టు ఇలా రివ్యూస్ మీద విరుచుకుపడ్డాడని.. లేదంటే సైలెంట్ గా ఉండేవాడని కూడా సెటైర్స్ వేశారు.

అయితే ఎన్టీఆర్ ఇలా మట్లాడకుండా ఉండాల్సిందంటున్నారు ఎన్టీఆర్ సన్నిహితులు. అందుకనే ఇంకెప్పుడు మీడియా సమావేశంలోగాని.. ఇంకెక్కడా గాని నోరుజారవద్దని... ఎన్టీఆర్ కి ఆయన సన్నిహితులు హిత బోధ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మీడియాతో ఎప్పుడు స్నేహపూర్వకంగా ఉండాలి తప్ప వారితో వైరం పెట్టుకోవడం తగదని చెప్పారట. అసలు ఎన్టీఆర్ ఇలా ఒక మీడియా సమావేశంలో మాట్లాడతారని కేవలం సన్నిహితులే కాదు ఆయన అన్న జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా ఊహించలేదంట. వాళ్ళే కాదు ఎవరు ఊహించలేదు.. జై లవ కుశ సినిమా రివ్యూస్ పై అలా ఎన్టీఆర్ రియాక్ట్ అవుతాడని.

ఇప్పుడు తెలియకుండానే జరగాల్సింది జరిగిపోయింది. ఇకనైనా మీడియాతో అణుకువగా ఉండమని అన్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ సన్నిహితులు ఎన్టీఆర్ కి సూచించగా దానికి ఎన్టీఆర్ కూడా పాజిటివ్ గా స్పందించినట్లుగా చెబుతున్నారు. ఇకమీదట ఇలాంటి తప్పులు భవిష్యత్తులో జరగవని కూడా ఎన్టీఆర్ వారికీ మాటిచ్చినట్లుగా చెబుతున్నారు.

Similar News