ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవకూడదని కోరుకుంటుందట

Update: 2017-04-12 11:16 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హ్యాపెనింగ్ బ్యూటీ స్థాయి నుంచి స్టార్ కథానాయిక గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ వంటి వరుస విజయాలతో దూసుకుపోతోంది. మరో వైపు ప్రస్తుతం సెట్స్ పై వున్న క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్ కి చేరిపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు-మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జూన్ 23 న విడుదలకి సిద్ధం అవుతుండగా, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న మరో చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకుంది. సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది. అక్కినేని నాగ చైతన్య హీరో గా నటిస్తున్న ఈ చిత్రంలో తన పాత్ర కూడా చైతు కి సమానంగా ఉంటుంది అని చెప్తున్న రకుల్ ఈ చిత్ర షూటింగ్ ఎప్పటికి ముగియకూడదు అని కోరుకుంటుంది అంట.

"ఇంత కాలం నేను చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోస్ సినిమాలలో కూడా నటించాను. నాకు అన్ని చిత్రాలలో ప్రాధాన్యత వున్న పాత్రలే దక్కినప్పటికీ అవన్నీ మెయిన్ ప్లాట్ లో ప్రాముఖ్యత లేనివి. సబ్ ప్లాట్ ని బలపరిచే పాత్రలలోనే ఇప్పటి వరకు నటించే అవకాశం లభించింది. కానీ రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో తొలి సారి హీరో తో ఈక్వల్ గా పాత్ర పోషిస్తున్నాను. నేను డ్రీం రోల్ గా అనుకునే జబ్ వుయ్ మెట్ లో కరీనా కపూర్ పోషించిన పాత్ర తరహాలో నా పాత్ర ఉండటంతో నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి ముగిసిపోకూడదు అని, ఈ థ్రిల్ నేను అనుభవిస్తూనే ఉండాలి అని ఆశపడుతున్నాను." అని ఆనందం వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

Similar News