ఈ రెండు సినిమాలకి రెండు కామన్ పాయింట్స్

Update: 2018-01-03 04:58 GMT

కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇంకో 13 రోజుల్లో సంక్రాంతి పండగ కూడా రానుంది. ఇది తెలుగు సినిమాకు అతి పెద్ద సీజన్. గత రెండేళ్లు నుండి సినిమాల మధ్య మంచి పోటీ ఉండేది. కానీ ఈ సంక్రాంతికి కొంచెం సందడి తక్కువగానే ఉండబోతోంది. 2016 లో నాలుగు.. 2017లో మూడు తెలుగు సినిమాలు రిలీజైతే.. ఈసారి రెండే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’తో పాటు బాలయ్య చిత్రం ‘జై సింహా' రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’ రిలీజ్ అవుతుంది.

అయితే ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలకి రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ రెండు సినిమాల్లో.. 'అజ్ఞాతవాసి', 'గ్యాంగ్'. ఈ రెండు సినిమాలకి ఒక్కరే మ్యూజిక్ డైరెక్టర్. అలానే ఈ రెండు సినిమాకి ఒక్కరే హీరోయిన్. తమిళ్ లో వరసపెట్టి మ్యూజికల్ హిట్స్ ఇస్తున్న అనిరుధ్ రవిచందర్..తొలిసారిగా తెలుగులో చేసిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అరంగేట్రంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించాడతను. ఈ సినిమా ఆడియో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు తమిళంలో అతను తొలిసారి సూర్య సినిమాకు పని చేసింది ‘గ్యాంగ్’కే. ఆ సినిమా మీదా అంచనాలు భారీగా ఉన్నాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా ఆసక్తి రేకెత్తించే విషయమే.

ఇక కీర్తి సురేష్ తొలిసారిగా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో నటించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. ఆమె తమిళంలో తొలిసారిగా సూర్య పక్కన చేసింది. ఆమెకు ఈ రెండు సినిమాలు కీలకమే. మరి అనిరుధ్, కీర్తి సురేష్ ఈ సంక్రాంతికి డబుల్ ధమాకా అందుకుంటారేమో చూడాలి.

Similar News