ఈ భామ భాధ కక్కలేనిది మింగలేనిది పాపం

Update: 2017-03-10 03:12 GMT

డాషింగ్ డైరెక్టర్ దర్శకత్వంలో వెండితెరకి పరిచయమైన కథానాయిక దిశా పటాని తొలి చిత్రం లోఫర్ ఫలితం బెడిసి కొట్టటంతో టాలీవుడ్ లో తరువాతి కాలంలో ఉనికి చాటుకోలేకపోయింది. కానీ బాలీవుడ్ లో బేఫికర్, ఎం.ఎస్.ధోని వంటి క్రేజీ ఆఫస్త్తో పాటు యాక్షన్ ఎంటర్టైనర్ కుంగ్ ఫు యోగ చిత్రంలో అంతర్జాతీయ స్టార్ హీరో జాకీ చాన్ తో కలిసి నటించింది. ఈ చిత్రాల ద్వారా తన క్రెడిబిలిటీ పెంచుకోవటంలో సక్సెస్ కాలేని దిశా పటాని బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్స్ దృష్టిలో మాత్రం పడగలిగింది. ఫలితంగా బాలీవుడ్ టాప్ ఫిలిం మేకర్ తాను తీయబోయే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సీక్వెల్ లో కథానాయికగా దిశా పటాని ని ఎంపిక చేసాడు.

తాజాగా మారిన పరిణామాలతో కరణ్ జోహార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటూ దిశా పటాని స్థానంలో స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తనయురాలు సారా అలీ ఖాన్ కి ఆ అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది. అయితే ఈ మార్పు కి దారి తీసిన కారణాలలో దిశా పటాని ప్రమేయం ఏ మాత్రం లేదట. ఎటువంటి తప్పు లేకపోయినా తాను ఈ అవకాశం కోల్పోవటంతో దిశా పటాని బాగా నిరుత్సాహ పడిపోయింది. కానీ ఒక వైపు స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మరో వైపు స్టార్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ ల ఉమ్మడి నిర్ణయం కావటంతో ఇంకా కెరీర్ ఎస్టాబ్లిష్ కానీ దిశా పటాని తన బాధ చెప్పుకోలేక, దిగ మింగుకోలేక సతమతమవుతోంది పాపం.

Similar News