మెగాస్టార్ చిరంజీవి తన 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా మొదలు కావడానికి కాస్త టైం పట్టేలా వుంది. అందుకే మెగాస్టార్ ఇపుడు ఒక ప్లాన్ చేస్తున్నాడట . ఇటీవలే మెగాస్టార్ చైనా వెళ్లి వచ్చాడు. నాటి 1980నాటి సౌతిండియన్ సినీనటుల కలయిక సెలబ్రేషన్స్ కోసమే ఆయన తన సతీమణి సురేఖతో ఆ వేడుకకు హాజరయ్యారు. దాంతోనే ఆయన దాసరి మరణవార్తను విన్నప్పటికీ కడచూపు చూసేందుకు రాలేదు.
మళ్ళీ ఇపుడు ఆయన హఠాత్తుగా ఫ్యామిలీ టూర్ వేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ అమెరికా టూర్ ఎందు కోసమో ఏమో తెలియదు కానీ ఆయన వెంట భార్య సురేఖతో పాటు అల్లుఅరవింద్ ఫ్యామిలీ కూడా కలిసి వెళ్తోంది. ఈ ట్రిప్లోప్రత్యేకతఏమీ లేదని, సాధారణంగా జరిగే ట్రిప్పేనంటున్నారు. అదే సమయంలో ఉయ్యాలవాడలో తన మేకోవర్ విషయంలో పలువురు హాలీవుడ్ సాంకేతికనిపుణుల నుంచి సలహ తీసుకుంటారని అంటున్నప్పటికీ ఇది కేవలం జాలీ ట్రిప్పే అని తెలుస్తోంది.