ఇప్పుడు తొందర పడుతున్నాడు

Update: 2017-11-08 11:17 GMT

మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో పోలిస్తే మెగా హీరో రామ్ చరణ్ మాత్రం సినిమాల విషయంలో చాలా స్లోగా ఉంటాడనే టాక్ ఉంది. స్టార్ హీరోలంతా సినిమాల మీద సినిమాల్తో బిజీగా వుంటుంటే చరణ్ మాత్రం కూల్ గా కంగారు లేకుండా సినిమాలు చేస్తుంటాడు. సినిమా మొదలెట్టినప్పుడు ఉండే స్పీడు... విడుదల సమయానికి ఉండదు. ఆ లెక్కనే చరణ్ సినిమాలన్నీ అనుకున్న టైం కి రాకుండా డిలే అవుతుంటాయనే నానుడి ఉంది. గత ఏడాది సురేందర్ రెడ్డి తో చేసిన ధ్రువ సినిమా విషయంలో జరిగిన జాప్యమే ఇపుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలంలోనూ జరుగుతుంది.

స్టార్ హీరోలంతా తాము చేస్తున్న సినిమాలు విడుదల కాకముందే మరో సినిమాని లైన్ లో పెట్టేసి పట్టాలెక్కించేస్తుంటే.. చరణ్ మాత్రం తాపీగా సినిమా పూర్తయ్యాక నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కూడా మారుతున్నాడట. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్నం రంగస్థలం అలా కంప్లీట్ కాగానే ఇలా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేస్తాడట. ఇక ఆ సినిమా కూడా పూర్తికాగానే కొరటాల సినిమాతో సెట్స్ మీదకెళతాడట.

అలాగే రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఒక పక్క బోయపాటి సినిమాతోపాటే మరోపక్క తన తండ్రి సై రా నరసింహారెడ్డి నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తాడట. అయితే తన షూటింగ్ కి ఇబ్బంది కలగకుండా సై రా నరసింహారెడ్డి నిర్మాణ బాధ్యతలను చరణ్ ఆద్వర్యం లోని ఒక టీమ్ కి అప్పగించబోతున్నాడట. చరణ్ ఎలా చెబితే అలా ఆ టీమ్ సభ్యులు సై రా సినిమా నిర్మాణంలో పాల్గొంటుంది. ఇక ఈ ఏడాది చరణ్ సినిమా ఒక్కటి విడుదల కాకపోయినా వచ్చే ఏడాది మాత్రం చరణ్ నుండి రంగస్థలంతో పాటే... బోయపాటి సినిమా కూడా వస్తాయని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

Similar News