ఇప్పటి వరకు తాను చేసిన పాత్రల్లో ఇదే స్ట్రాంగ్ అంట

Update: 2017-02-25 11:20 GMT

అందాల రాక్షసి తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి తొలి చిత్రంతోనే విజయం అందుకోవటంతోపాటు తరువాతి చిత్రాలు దూసుకెళ్తా, భలే భలే మగాడివోయి, సోగ్గాడే చిన్ని నాయనా వంటి చిత్రాలతో తన విజయ పరంపరని కొనసాగించింది. గత ఏడాది యంగ్ హీరో అల్లు శిరీష్ సరసన నటించిన శ్రీ రస్తు శుభమస్తు చిత్రం అల్లు శిరీష్ కి తొలి విజయం కాగా, లావణ్య త్రిపాఠి కెరీర్లో మరో విజయవంతమైన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠి నటించిన తెలుగు చిత్రాలలో లచ్చిందేవికి ఓ లెక్కుంది చిత్రం తప్ప మిగిలిన సినిమాలన్నీ విజయాలే. అయినప్పటికీ లావణ్య వరుసగా సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకుని ఒక్కో చిత్రానికి తన పాత్ర పరిధిని పెంచుకుంటూ చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటోంది.

2012 లో కథానాయికగా పరిచయం అయిననాటి నుంచి నేటి వరకు లావణ్య త్రిపాఠి హీరోయిన్ పాత్రలు పోషించిన సినిమాలు కేవలం ఆరు మాత్రమే. మధ్యలో అక్కినేని కుటుంబ చిత్రం మనం లో అక్కినేని నాగ చైతన్య కి స్నేహితురాలిగా రెండు సన్నివేశాలలో మెరిసింది. తండ్రి అక్కినేని నాగార్జున సరసన కథానాయికగా నటించిన అనంతరం ఇప్పుడు కొడుకు నాగ చైతన్య సినిమాలో నటించటం లావణ్య త్రిపాఠికే చెందింది. అయితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లావణ్య పోషిస్తున్న పాత్ర ఇప్పటి వరకు తన కెరీర్ లో చేసిన పాత్రలన్నిటికంటే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కథానాయకుడు నాగ చైతన్య తన లక్ష్యాన్ని చేరుకోవటానికి సహకరించే కీలక కథానాయిక పాత్రలో కనిపించనుందట లావణ్య త్రిపాఠి.

ప్రస్తుతం నాగ చైతన్య చిత్రంతో పాటు మెగా హీరో వరుణ్ తేజ్-శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది లావణ్య త్రిపాఠి.

Similar News