ఆరవ సారి మెటీరియలైజ్ కాబోతున్న క్రేజీ కాంబినేషన్

Update: 2017-03-10 18:53 GMT

టాలీవుడ్ లో బాగా క్రేజ్ వున్నా హీరో-డైరెక్టర్ కాంబినేషన్స్ లో అతి ముఖ్యమైన కాంబినేషన్ గా పేరు వున్నది మాస్ మహా రాజా రవి తేజ-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లది. ఇప్పటి వరకు వీరి కలయికలో ఐదు చిత్రాలు రాగా వాటిల్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందగా నేనింతే చిత్రం విమర్శకుల మెప్పుతో పాటు పలు పురస్కారాలు పొందింది. వీరి కలయికలో తెరకెక్కిన ఆఖరి చిత్రం దేవుడు చేసిన మనుషులు మాత్రం ఘోర పరాజయం చవి చూసింది. అయితే చేసిన ఐదు చిత్రాలలో నాలుగు చిత్రాలు పాజిటివ్ రివ్యూస్ తో ప్రదర్షింపబడటంతో వీరి కాంబినేషన్ కి క్రేజ్ ఇప్పటికి వుంది.

తాజాగా నందమూరి బాల కృష్ణ 101 వ చిత్ర దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్న పూరి జగన్నాథ్ తన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29 న విడుదల చేతామని ప్రకటించాడు. సెప్టెంబర్ తరువాత తన తదుపరి చిత్రం రవి తేజ తో చేయనున్నట్టు కూడా సంకేతాలు ఇస్తున్నాడు పూరి. ప్రస్తుతం జ్యోతి లక్ష్మి, లోఫర్, ఇజమ్ ల వరుస పరాజయాలతో కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లో వున్న పూరి రాబోతున్న రోగ్ మరియు బాలయ్య చిత్రాల విజయాలతో ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రాలు సక్సెస్ అయితే మాత్రం పూరి మానియా తిరిగి మొదలు కావటంతో పాటు రవి తేజ కాంబినేషన్ తో వున్న క్రేజ్ తోడై పూరి-రవి తేజల సినిమాకి ఫాన్సీ రేట్లు దక్కే అవకాశాలు మెండుగా ఏర్పడతాయి.

Similar News