ఆమె అంత లక్కీనా...!!

Update: 2017-03-25 06:42 GMT

ఎన్టీఆర్ తన 27 వ చిత్రాన్ని మొదలుపెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. 'జనతా గ్యారేజ్' హిట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని బాబీ డైరెక్షన్ కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఈ చిత్రం మొదలైనప్పటినుండి కూడా ఈ చిత్రంపై రకరకాల వార్తలు రోజూ ఎదో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే వున్నాయి. అందులో ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడని... మూడు విభిన్న పాత్రల కోసం బాగా కష్టపడుతున్నాడని..... ఈ సినిమా టైటిల్ గురించి అబ్బో ఒకటేమిటి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

ఇక ఈ చిత్రానికి 'జై లవ కుశ' టైటిల్ దాదాపు ఫిక్స్ అని నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో హీరోయిన్స్ ఇంకా పూర్తిగా సెట్ అవలేదు గాని ఇప్పుడు ఒక ముఖ్య పాత్ర కోసం హంస నందిని ని తీసుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటికే హంస పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ లో నర్తించింది. అయితే ఆమె ఐటెం చేసిన సినిమాలన్నీ చాలావరకు హిట్ అయ్యాయి. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రంలో కూడా హంస నందిని కి ఒక స్పెషల్ కేరెక్టర్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో హంసానంది రోల్ సంథింగ్ స్పెష‌ల్‌గా ఉంటుంద‌ని తెలుస్తుంది.

అసలు ఇప్పటికే ఎన్టీఆర్ చిత్రంలో హంస నందిని పై కొన్ని సీన్స్ చిత్రీకరణ పూర్తయినట్లు కూడా సమాచారం అందుతుంది. మరి ఆమెను ఏ పాత్రకి ఎంపిక చేశారో తెలియదు గాని... ఇప్పటికి ఒక హీరోయిన్ గా రాశి ఖన్నాని ఎంపిక చేసిన చిత్ర యూనిట్ మరో హీరోయిన్ గా నివేద థామస్ ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లుగా వార్తలయితే వచ్చాయి... కానీ చిత్ర యూనిట్ ఇంతవరకు దానిని కన్ఫర్మ్ చెయ్యలేదు.

Similar News