ఆ దర్శకుడి పేరు వింటేనే హడలిపోతున్న నందమూరి అభిమానులు

Update: 2017-04-02 07:52 GMT

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆసక్తి రేపుతున్న అరుదైన క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటి నట సింహం నందమూరి బాల కృష్ణ-డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లది. యావత్ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు నందమూరి బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ సంభాషణలలో తన మార్క్ యాటిట్యూడ్ పూరి ఎలా ప్రాజెక్ట్ చేస్తాడా అని అంచనాలతో ఎదురు చూస్తుంటే బాల కృష్ణ అభిమానులు మాత్రం పూరి జగన్నాథ్ పేరు వింటేనే భయాందోళనలకు గురవుతున్నారు. టెంపర్ చిత్రంతో తారక్ కి విజయాన్నిచ్చిన పూరి గత ఏడాది ఇజమ్ తో కళ్యాణ్ రామ్ కి డిసాస్టర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు జ్యోతి లక్ష్మి, లోఫర్ చిత్రాలు కూడా ఇటీవలి కాలంలో పూరి కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లోప్స్ గా మిగిలిపోయాయి.

కాగా బాలయ్య తో పూరి సినిమా ఫైనలై తొలి షెడ్యూల్ మొదలైన నాటి నుంచి బాలయ్య అభిమానులు రోగ్ చిత్ర ఫలితం పై ఆశగా ఎదురు చూసారు. రోగ్ చిత్రానికి మరో చంటిగాడి ప్రేమ కథ అంటూ ఉపశీర్షికని తగిలించిన పూరి ఇడియట్ స్థాయి సినిమా ఏదైనా చేసి ఉంటాడని ఆశపడ్డ బాలయ్య అభిమానులకి రోగ్ చిత్ర ఫలితం నిరాశ మిగిల్చటమే కాక భయాన్ని పెంచింది. వరుసగా నాలుగు పరాజయాలు మూటగట్టుకున్న పూరి ఇప్పుడు బాలయ్యతో ఎలాంటి ఫలితం ఇవ్వనున్నాడనే భయం బాలయ్య అభిమానులకి నిద్ర పట్టకుండా చేస్తోంది. మరో వైపు ఒక్క టెంపర్ తప్పితే నందమూరి కథానాయకులతో పూరికి బాడ్ సెంటిమెంట్ మాత్రమే వుంది. తారక్ తో చేసిన తొలి చిత్రం ఆంధ్రావాలా, కళ్యాణ్ రాంతో చేసిన తొలి చిత్రం ఇజమ్ బెడిసికొట్టగా ఇప్పుడు బాలయ్యతో పూరి చేస్తున్న తొలి చిత్రం ఈ బాడ్ సెంటిమెంట్ బారిన పడకూడదని కోరుకుంటున్నారు అభిమానులు. తారక్ తో పూరి ఇచ్చిన హిట్ చిత్రం టెంపర్ కథ పూరి రాసినది కాదు. వక్కంతం వంశి రాసిన కథని పూరి తెరకెక్కించి విజయం సాధించటం తెలిసిందే.

Similar News