అసలది అక్కినేని వారిది కాదట

Update: 2017-10-22 02:17 GMT

అక్కినేని కుటుంబం మొత్తం ఒకే సినిమాలో కనబడిన... అక్కినేని నాగేశ్వరావు చివరి సినిమా అయినా 'మనం' సినిమా కథ అచ్చంగా అక్కినేని కుటుంబం కోసమే పుట్టినట్టుగా అనిపించింది. 2014 లో అక్కినేని కన్ను మూసిన తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మనం' సినిమా కథ లో అక్కినేని ఫ్యామిలీ హీరో అయినా నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ లు కనబడ్డారు. ఇలా మూడు తరాల నటులు ఒకే సినిమాలో కనబడడం అరుదెం కాదుగాని... అలా కుటుంబ హీరోలంతా కలిసి నటించడం మాత్రం ఎంతో అద్భుతమైన దృశ్యమే.

అయితే ఆ 'మనం' కథ అక్కినేని వారి ఫ్యామిలీ కోసం రాసుకున్న కథ కాదంట. ఆ కథ రాసుకున్నది... వేరే నటుల కోసమట. కానీ అనుకోకుండా ఆ కథ అక్కినేని హీరోల చేతికి రావడం వారు ఒకే చెయ్యడం... సినిమా చెయ్యడం.. విడుదల కావడం... హిట్ కావడం జరిగిపోయిన చాన్నాళ్ళకి ఆ కథ అక్కినేని వారిదికాదు మరొకరాదనే ప్రచారం మొదలైంది. విక్రమ్ కుమార్ మొదటగా 'మనం' కథ రాసుకున్నది వేరే నటుల కోసమని.. ఆ నటులు కూడా కె విశ్వనాధ్ , వెంకటేష్, సిద్దార్ధ్ కోసమట. ఈవిషయాన్ని స్వయంగా నటుడు సిద్దార్ధ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో హీరో సిద్దార్థ్ ఈ విషయాన్ని చెప్పుకుని.. ఆ ఛాన్స్ తాను పోగొట్టుకున్నానని చెప్పడమే కాదు.. 'మనం' సినిమాలో నాగేశ్వర రావు పాత్రకి కె విశ్వనాధ్ ని... నాగార్జున పాత్రకి వెంకటేష్ ని.. నాగ చైతన్య పాత్రకి సిద్దార్దని అనుకున్నారనే విషయాన్నీ బయట పెట్టాడు. అయితే ఆ సినిమా కథ అనుకోకుండా తన చేజారి అక్కినేని వారి చేతుల్లోకి వెళ్లిందని చెప్పాడు. మరి 2014 నుండి కామ్ గా ఉండి ఇప్పుడు ఇన్నాళ్లకు సిద్దార్థ 'మనం' కథ తనకోసమే పుట్టిందని... కానీ చివరకి అది అక్కినేని వారి చెంతకు చేరిందని చెప్పడంలో పరమార్ధమేమిటనే చర్చలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదలయ్యాయి.

Similar News