అలాంటి ప్రచారంతో సినిమాను ముంచొద్దు అంటున్న రకుల్

Update: 2016-12-11 06:38 GMT

అగ్ర కథానాయకులందరితో వరుసగా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో గత ఏడాది బ్రూస్ లీ చిత్రం ద్వారా తొలిసారి తెరను పంచుకుంది. వారి కాంబినేషన్ ఫెయిల్యూర్ తో బోణి కొట్టినప్పటికీ ఏ మాత్రం నిరుత్సాహపడక మరో ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ఆన్ స్క్రీన్ జంట. యాక్షన్ ప్యాకెడ్ కంటెంట్ గా తెరకెక్కిన ధ్రువ చిత్రం ప్రేక్షకులకు బాగా చేరువ అవుతుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ లో కూడా రామ్ చరణ్, రకుల్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ ఐయింది. విడుదల నాటి నుంచే అభిమానులు ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. అయితే సినిమా ప్రమోషన్ చేసే విషయంలో మాత్రం అభిమానానికి హద్దులు ఉండాలి అంటూ మెగా అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.

ఈ మధ్య పైరసీ ప్రింట్ ల బెడద కొంచం తగ్గు ముఖం పట్టినప్పటికీ రోజు రోజుకి సామాన్యుడికి అతి చేరువ అవుతున్న అధునాతన సాంకేతికత సినీ పరిశ్రమకు ముప్పుగా మారింది. ఇదే పరిస్థితి ధ్రువ చిత్రానికి కూడా ఎదురు ఐయ్యింది. మెగా అభిమానులు అమితంగా ఆకర్షించబడిన అంశాలలో చెర్రీ ఫిజిక్, హీరో విలన్ల మధ్య మైండ్ గేమ్, హీరో హీరోయిన్ల మధ్య ప్రపోసల్, ఇంట్రడక్షన్ సాంగ్ లు ముఖ్య పాత్ర పోషించాయి. అయితే అభిమానులు వారి ఆనందాన్ని ఇతరులతో పంచుకోవటానికి థియేటర్ వద్ద క్రౌడ్ ని స్నాప్ షాట్ తీసినట్టే ఈ సన్నివేశాలను కూడా వారి చరవాణీలలో బంధించి వాటిని సామాజిక మాద్యమాల ద్వారా ఇతరులతో పంచుకుంటున్నారు. ఈ పద్ధతి సమంజసం కాదు అని మెగా అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది రకుల్.

"మౌత్ టాక్ తో సినిమా ని ప్రమోట్ చేయండి. ఆలా చేస్తే మమ్మల్ని ప్రోత్సాహించిన వారు అవుతారు. ఇలా డిజిటల్ ప్రచారంలో భాగంగా స్నాప్ షాట్స్ తీసి ప్రచారం చేస్తే మా కష్టాన్ని దోచుకున్నవారవుతారు. ప్రతి ప్రేక్షకుడు అనుభూతి తో బైటకి వెళ్ళాలి. మీరు ముందుగానే చిత్రంలోని ముఖ్య అంశాలను వారితో పంచుకుంటే వారు సినిమా ఎంజాయ్ చేయటం అసాధ్యం. మెగా అభిమానులు ధ్రువ చిత్ర బృందానికి సహకరిస్తారని బలం గా నమ్ముతున్నాను." అంటూ సున్నితంగా వారించింది రకుల్.

Similar News