అలా ఎంట్రీ ఇచ్చిందో.. ఇలా గాసిప్స్ మొదలు!!

Update: 2017-11-17 15:00 GMT

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బడా కింగ్ మేకర్ కరణ్ జోహార్ ఆధ్వర్యంలో శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో 'ధఢక్' చిత్రంతో బాలీవుడ్ నుండి ఎంట్రీ ఇవ్వబోతుంది జాన్వీ కపూర్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ సరసన ఇషాన్ ఖట్టర్ హీరో గా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తుందా అని ఇప్పటి వరకు ఎదురు చూసిన జనాలకు ఇప్పుడు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరబోతోంది.

క్యూ కడుతున్నారా?

అయితే జాన్వీ అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. ఇలా ఆమెకు అవకాశాలు క్యూ కట్టేశాయనే న్యూస్ మాత్రం కథనాలు కథనాలుగా బాలీవుడ్ మీడియాలో ప్రసారమవుతున్నాయి. అందులో భాగంగానే తెలుగు 'టెంపర్' ని బాలీవుడ్ లో రీమేక్ చేయనున్న దర్శకుడు రోహిత్ శెట్టి... ఆ సినిమా కోసం జాన్వీ కపూర్ ని సంప్రదిస్తున్నాడనే న్యూస్ వినబడుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ పనులను మొదలు పెట్టిన రోహిత్ శెట్టి ఈ సినిమాలో నటించే నటీనటులు ఎంపిక మీద ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది.

టెంపర్ రీమేక్ లో....

అయితే తెలుగు 'టెంపర్' లో హీరోగా చేసిన ఎన్టీఆర్ రోల్ కి హిందీలో రణ్వీర్ సింగ్ ని తీసుకోగా... తెలుగులో కాజల్ చేసిన పాత్రకి హిందీలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని అనుకుంటున్నారట. అయితే కాజల్ కి 'టెంపర్' లో మంచి గ్లామర్ పాత్ర దక్కింది. అందుకే హిందీలో జాన్వీ కపూర్ అయితే ఈ గ్లామర్ పాత్రకి కరెక్ట్ గా సూట్ అవుతుందని రోహిత్ శెట్టి భావిస్తున్నాడట. అయితే జాన్వీ కపూర్ పేరు కేవలం పరిశీలనలో ఉన్నట్టు... ఆమెని ఫైనల్ గా ఇంకా ఎంపిక చెయ్యనట్టుగా చెబుతున్నారు. ఇకపోతే హిందీ 'టెంపర్' వచ్చే ఏడాది జనవరి నుండి సెట్స్ మీదకెళుతుందంటున్నారు.

Similar News