అన్నపూర్ణ స్టూడియోస్లో చైతు వివాహానికి రంగం సిద్ధం

Update: 2017-03-01 09:56 GMT

గత ఏడాది సంక్రాంతి పండుగకు సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన రెండవ చిత్రాన్ని కూడా అక్కినేని హీరో నాగ చైతన్యతోనే చేస్తున్న సంగతి విదితమే. శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు కళ్యాణ్ కృష్ణ అండ్ టీం. అక్కినేని నాగ చైతన్య తోకలిసి రకుల్ ప్రీత్ సింగ్ మరియు లావణ్య త్రిపాఠి వెండితెరని పంచుకుంటున్నారు. సెకండ్ షెడ్యూల్ టాకీ భాగం చిత్రీకరణలో వున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక పెద్ద సెట్ ఇప్పటికే సిద్ధం చేశారు.

కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని నాగ చైతన్య పెళ్లి సన్నివేశం కోసం ఒక అద్భుతమైన పెళ్లి మండపం సెట్ ని భారీ మొత్తం వెచ్చించి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేశారు. రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య త్రిపాఠి లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఈ ఖరీదైన సెట్లో నాగ చైతన్య కి అర్ధాంగిగా కనిపించే అదృష్టం ఎవరిదో ఇప్పటికైతే మనకి సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

నాగా చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ తొలిసారి నటిస్తుండగా, లావణ్య త్రిపాఠి మనం చిత్రంలో చైతూకి స్నేహితురాలి పాత్రలో ఒక సన్నివేశంలో నటించింది. కళ్యాణ్ కృష్ణ తొలి చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అక్కినేని నాగార్జున శ్రీమతిగా లావణ్య త్రిపాఠి నటించిన సంగతి తెలిసిందే.

Similar News