అనుష్కతో మెహ్రీన్ అందుకే!!

Update: 2017-09-29 15:00 GMT

ఈరోజు అంటే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహానుభావుడు చిత్రం పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. అయితే బాహుబలి దేవసేన అనుష్క శెట్టి మహానుభావుడు హీరోయిన్ మెహ్రీన్ తో కలిసి మహానుభావుడు మొదటి షోని వీక్షించినట్లు ఒక సెల్ఫీ ఫోటో ద్వారా అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే సడన్ గా అనుష్క మహానుభావుడు సినిమా వీక్షించడం ఏమిటా అనుకున్న వారి అనుమానాలుని వృత్తి చేసేద్దాం. అనుష్క ఇక్కడ మహానుభావుడు చిత్రం వీక్షించడానికి కారణం మహానుభావుడు సినిమాని నిర్మించిన నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారే.

మహానుభావుడు ఎందుకు చూశారంటే?

యువి క్రియేషన్స్ వారు నిర్మాణ రంగంలో అడుగుపెట్టిన్నప్పటినుండి మంచి సక్సెస్ లు అందుకుంటూ నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది. ప్రభాస్ తో మిర్చి సినిమాని నిర్మించిన ఈ సంస్థ ప్రతినిధులు అవకాశం ఉన్నప్పుడు అంటే తాప్సి నటించిన ఆనందో బహ్మ సినిమా ప్రమోషన్ కి, మహానుభావుడు రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ని వాడారు. అలాగే ఇప్పుడు ఈ మహానుభావుడు షోని అనుష్క కోసం ప్రత్యేకంగా వేసి చూపించి ప్రమోట్ చేసింది. అయితే ఈ సంస్థ అనుష్క ని మెయిన్ లీడ్ లో పెట్టి భాగమతి సినిమాని నిర్మించింది. అయితే అనుష్కని ప్రమోషన్ కోసం వాడలేదని కేవలం అనుష్క మహానుభావుడు సినిమా చూపించాలని కోరడంతోనే స్పెషల్ షో వేసి చూపించామని చెబుతున్నారు. మరి సడన్ గా అనుష్క మహానుభావుడు తో ఎంట్రీ ఇచ్చేసరికి అనుష్క అభిమానులకు ఒక పక్క సంతోషం గా ఉన్నప్పటికీ మరోపక్క స్వీటీ మాత్రం ఎప్పటిలా నాజూగ్గా తయారవలేదు... అలా లావుగానే కనబడుతుంది అని నిరాశ పడ్డారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Similar News