అను పారితోషకం లో కోత..?

Update: 2018-05-24 07:00 GMT

'నా పేరు సూర్య' సినిమాకు ఇక టాటా చెప్పే టైం వచ్చేసిందనే చెప్పాలి. మరో రెండురోజుల్లో కొత్త సినిమాలు ఉండటంతో ఈ సినిమాను తీసేసి పరిస్థితి వచ్చింది. మెయిన్ సెంటర్స్ లో తప్ప దాదాపు అన్ని సెంటర్స్ లో ఈ సినిమాను ఎత్తేయనున్నారు. ఇకపోతే ఆడియో లాంచ్ నుంచి సక్సెస్ మీట్ దాకా ఈ సినిమా హీరోయిన్ అను ఇమ్మానియేల్ ప్రమోషన్స్ లో ఎక్కడ కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.

పెరిగిన డిమాండ్...

అంతా తన సినిమాలతో బిజీగా ఉందనుకున్నారు, కానీ కారణం వేరే ఉందంట. అను ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్న హీరోయిన్. సినిమాలకి తన డిమాండ్ పెరగడంతో పారితోషికం కూడా ఎక్కువ పెంచేసిందంట. కానీ 'నా పేరు సూర్య' ఇప్పుడు ఒప్పుకున్న సినిమా కాదు. ఏడాది క్రితమే సైన్ చేసింది. అప్పుడు అనుకున్న పారితోషికం కంటే కొంచెం ఎక్కువగానే డిమాండ్ చేసింది. సినిమా మీద నమ్మకంతో ప్రొడ్యూసర్స్ కూడా ఏం ఆలోచించకుండా ఓకే అనేసారు. కానీ రిలీజ్ కి ముందు తన అమౌంట్ క్లియర్ చేస్తామని నిర్మాతలు అనడంతో అలిగి వాటికి దూరంగా ఉందని ఫిలింనగర్ టాక్.

తర్వాత చూద్దామంటున్నారు పాపం...

తీరా సినిమా రెజల్ట్ కూడా తేడా కొట్టడంతో మిగిలిన బాలన్స్ తర్వాత చూద్దాం అని నిర్మాతలు చెప్పినట్టు సమాచారం. మరి నిర్మాతలు పాపంలే అని ఆమె అడిగిన డబ్బులు ఇచ్చేస్తారా లేక ప్రమోషన్స్ కి రాలేదని సగం కట్ ఇస్తారా చూడాలి. అసలే సినిమా పోయిందని బాధల్లో ఉంటే మధ్యలో ఈ సెటిల్మెంట్ ఏంటో?

Similar News