అదిరిపోయే యాక్షన్ సీన్స్ వున్నాయట!!

Update: 2017-06-21 15:00 GMT

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం ఎట్టకేలకు టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు షూటింగ్ ఆలస్యమవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. ఇంకేమిటి దసరాకి విడుదల కూడా కష్టమే అన్నారు. మరి రెండు భాషల్లో ఏకకాలంలో సినిమా తెరకెక్కిస్తుంటే ఈ మాత్రం ఆలస్య అవదా అంటున్నారు కొంతమంది. మరికొంతమంది ఔట్పుట్ కరెక్టుగా ఉండాలనే ప్రయత్నంలో షూటింగ్ ఆలస్యమే కాదు ఏమైనా జరగొచ్చు అంటున్నారు. మరి మురుగదాస్ కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.

ఇకపోతే ఇటీవలే చెన్నైలో జరిగిన చివరి షెడ్యూల్లో సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ సీన్స్ ని షూట్ చేశారట. 'స్పైడర్' చిత్రం హెవీ యాక్షన్ సబ్జెక్టు కాబట్టి క్లైమాక్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందించినట్టు చెబుతున్నారు. ఈ భారీ యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ ఫైటింగ్ కొరియోగ్రఫర్ పీటర్ హెయిన్స్ కంపోజ్ చేశారని, మహేష్ కి 'స్పైడర్' విలన్ ఎస్.జె సూర్యలకు మధ్య వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాలు 'స్పైడర్' చిత్రానికే హైలెట్ గా నిలవబోతున్నాయని అంటున్నారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ మహేష్ ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు బాగా నచ్చుతాయనే టాక్ వినబడుతుంది.

రకుల్ ప్రీత్ సింగ్ 'స్పైడర్' చిత్రంలో మహేష్ కి జోడిగా నటిస్తుండగా.... తమిళ నటుడు భారత్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు. హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న 'స్పైడర్' చిత్రం వచ్చే దసరాకి విడుదల కానున్నట్లు చిత్ర టీమ్ అధికారికం గా ప్రకటించింది.

Similar News