అదా.. విషయం...!!

Update: 2017-07-31 13:00 GMT

రామ్ చరణ్, మహేష్ బాబు లు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం ఈ మధ్యనే అందరికి తెలిసింది. మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్స్ కి విదేశాలకు వెళ్ళినప్పుడు రామ్ చరణ్ తన భార్యతో కలిసి అక్కడికే రావడంతో వారి రెండు ఫ్యామిలీస్ కలిసి అక్కడ హడావిడి చెయ్యడం.... రెండు కుటంబాలు ఫొటోస్ తో సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం తెలిసిన సంగతే. ఇక రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, మహేష్ వైఫ్ నమ్రతలు కూడా మహేష్, చరణ్ లాగా మంచి దోస్త్ లయ్యారు. అయితే వీరిద్దరూ ఒక పక్క సెలెబ్రేటిస్ కావడం.... టాప్ హీరోల భార్యలవడంతో వారు ఎక్కడికి వెళ్లి ఏపని చేసినా మీడియాలో ప్రముఖంగా వార్తలొచ్చేస్తుంటాయి.

అయితే ఇప్పుడు ఉపాసన, నమ్రతలు కలిసి ఒక అమ్మాయికి ముద్దుపెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నిన్న ఆదివారం ఒక బర్త్ డే ఈవెంట్ లో తీసిన ఫోటో అది. ఆ ఫొటోలో ఉపాసన, నమ్రతలు ఇద్దరూ ఆ అమ్మాయికి కిస్ ఇచ్చేస్తూ హడావిడి చెయ్యడం ఇప్పుడు మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వారిద్దరూ ముద్దు పెడుతున్న అమ్మాయి ఎవరో కాదట. అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకుని బ్రేకప్ చేసుకున్న శ్రియ భూపాల్ వదిన అంట. శ్రియ భూపాల్ అన్నయ భార్య ధియా మెహతా అంట. అయితే ధియా మెహతా, కృష్ణ భూపాల్ కు పిల్లల బర్త్ డే నిన్న కావడంతో ఆ పార్టీకి అటెండ్ అయిన ఉపాసన, నమ్రతలు అలా దియాకి ముద్దెట్టేశారన్నమాట.

అయితే శ్రియ భూపాల్ మాదిరి గానే ఆమె అన్నయ్య కృష్ణ భూపాల్ కూడా మొదటగా డెక్కన్ క్రానికల్ అధినేత కూతురు గాయత్రి రెడ్డిని పెళ్ళిచేసుకోవడానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఆ తరువాత కొన్ని కారణాలతో ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ముంబాయ్ కు చెందిన జ్యూయలరీ డిజైనర్ కూతురు ధియా మెహతా ను వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయినే ఇప్పుడు వీరిద్దరూ ముద్దులతో ముంచెత్తారన్నమాట. అయితే శ్రియ భూపాల్ ఫ్యామిలీ ఉపాసన ఫ్యామిలీకి చుట్టరికాలుండడంతో ఎప్పటికపుడు శ్రియ భూపాల్ ఇంటి ఫంక్షన్స్ లో ఉపాసన అటెండ్ అవ్వడం పరిపాటి కానీ... ఇక్కడ నమ్రత కూడా ఈ పార్టీకి అటెండ్ అవ్వడం మాత్రం కొంచెం వివేషంగానేచేపుకోవాలి మరి.

Similar News