అక్కినేని వారసులకు రెండవ చిత్ర సెంటిమెంట్

Update: 2016-11-25 06:23 GMT

అక్కినేని మూడవ తరం వారసులు కథానాయకులుగా బిజీ అయిపోయారు. అక్కినేని నాగ చైతన్య తొలి చిత్రం జోష్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో భారీ అంచనాల మధ్యన విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. కానీ జోష్ చిత్రానికి కనెక్ట్ ఐన యూత్ కొందరు ఉండటం విశేషం. చైతు తదుపరి చిత్రం ఏ మాయ చేసావే గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో చైతూకి తొలి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది.

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని తొలి చిత్రం మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మితిమీరిన అంచనాలు, భారీ ప్రచారాల నడుమ విడుదలై అఖిల్ అక్కినేని కి జీవిత కాలం మర్చిపోలేని చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. నాటి నుంచి తన రెండవ చిత్ర కథ నిర్ణయం పై అనేక తర్జన భర్జనలు పడుతూనే వున్నాడు అఖిల్ అక్కినేని. తాజాగా మనం ఫేమ్ విక్రమ్ చెప్పిన కథ ను అంగీకరించాడు. కాగా దర్శకుడు విక్రమ్ ఈ చిత్రం సంగీతానికి రెహ్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. తొలి చిత్ర వైఫల్యం తరువాత ఆకలి మీద వున్నా అఖిల్ కు అన్న చైతు తరహాలో రెహమాన్ సంగీతం రెండవ సినిమా సెంటిమెంట్ ను నిలుపుతుందో లేదో చూడాలి.

Similar News