అక్కినేని కాంపౌండ్ వదలనంటోంది!!

Update: 2017-03-14 09:20 GMT

'అ....ఆ' చిత్రంలో నెగెటివ్ రోల్ లో మెప్పించిన అనుపమ పరమేశ్వరన్ నాగ చైతన్య తో 'ప్రేమమ్' చిత్రంలో నటించింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన 'శతమానంభవతి'లో నటించింది. ఇక ఆమె నటించిన టాలీవుడ్ చిత్రాలన్నీ వరసబెట్టి హిట్ అవడంతో ఆమెకు సుడి తిరిగి టాలీవుడ్ లో ఒక రేంజ్ లో అవకాశాలు ఆమె తలుపు తడతాయని అందరూ భావించారు. అందరూ అనుకున్నట్టే స్టార్ హీరో రామ్ చరణ్ పక్కన అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అయ్యో అనుకునేలోపే మళ్ళీ అనుపమకు అక్కినేని కాంపౌండ్ నుండి కబురొచ్చింది.

అనుపమ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానేర్ లో హీరోయిన్ గా నటించబోతుందని సమాచారం. అయితే అక్కినేని వారసులతో గాని నాగార్జునతో గాని అనుపమ నటించడం లేదట. కేవలం నాగార్జున నిర్మించబోయే చిత్రంలో మాత్రమే నటిస్తోంది. చందు మొండేటి డైరెక్షన్ లో నాగార్జున - నిఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో అనుపమ, నిఖిల్ కి జోడిగా నటించబోతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ ఓకె అయిన ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా మొదలు కాలేదట. మరోపక్క నాగార్జున 'రాజుగారి గది 2 ' చిత్రంతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని తన బ్యానేర్ లో నిర్మించాలా లేదా అనేది నాగార్జున రెండుమూడు రోజుల్లో ఫైనల్ చేస్తాడని అంటున్నారు.

ఇక నిఖిల్ కూడా కేశవ షూటింగ్ లో బిజీగా ఉండడంతో... నాగార్జున - నిఖిల్ కాంబో ప్రాజెక్ట్ కి కొద్దిగా టైం పడుతుందని.... ఈలోపు మిగిలిన కార్యక్రమాలు పూర్తి చెయ్యడానికి చందు మొండేటి రెడీ అవుతున్నాడట. అయితే రెండు మూడు హిట్స్ తో దూసుకుపోతున్న అనుపమని మాత్రం ఈ సినిమలో హీరోయిన్ గా సెట్ చేసింది మాత్రం నాగార్జునే అనే టాక్ వినబడుతుంది.

Similar News