అందుకే ఆ ప్లాన్ చేశాడా?

Update: 2017-09-08 08:00 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీను వైట్ల కామెడీ టైమింగ్ తో టాప్ దర్శకుడిగా సెటిల్ అయ్యాడు. కామెడీ జోనర్ నమ్ముకునే దర్శకుడిగా ఒక్కో మెట్టు ఎక్కినా కూడా ఇప్పుడు మాత్రం ప్లాపుల పరంపర కొనసాగిస్తూ ఏ హీరో అవకాశమివ్వక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరుసగా 'ఆగడు, బ్రుస్ లీ, మిష్టర్' వంటి ప్లాపులిచ్చిన శ్రీను వైట్లతో సినిమా అంటే హీరోలంతా ఆమడ దూరం పారిపోతున్నారు. కేవలం హీరోలేనా... నిర్మాతలకు కూడా శ్రీనుతో సినిమా అంటేనే భయం పట్టుకుంది. మహేష్ బాబు వంటి హీరో దూకుడు హిట్టిచ్చినా శ్రీను 'ఆగడు'లో భారీ డిజాస్టర్ ఇచ్చాడు. అయినా రామ్ చరణ్ పిలిచి 'బ్రుస్ లీ' ఇస్తే దాన్ని చెడకొట్టాడు. ఇక వరుణ్ తేజ్ తో 'మిష్టర్' సినిమా కూడా ఘోరమైన ప్లాపును చవి చూసింది.

అయితే శ్రీను వైట్ల ఆప్తుడైన హీరో రవితేజ శ్రీను కి ఒక అవకాశం ఇచ్చినట్లుగా ఆ మధ్యన వార్తలొచ్చాయి. రవితేజ - శ్రీను వైట్ల కలయికలో ఒక సినిమా దాదాపు ఖరారైనట్లే అన్నారు. ఇక ఈ సినిమాని 'మిష్టర్' చిత్ర నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తాడనుకున్నారు. కానీ ఆయన వరుస ప్లాపులతో సతమతమవుతూ చేతులెత్తేశారట. అయితే శ్రీను - రవి ల సినిమాని ఇప్పుడు మైత్రి మూవీ వారు నిర్మిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి అంత పెద్ద నిర్మాణ సంస్థ శ్రీను వైట్లని ఎలా నమ్మింది అంటూ ఇప్పుడు సినీపరిశ్రమలో హాట్ హాట్ చర్చ నడుస్తుంది. అయితే శ్రీను వైట్ల ఇప్పుడు రొటీన్ గా కాకుండా ఒక డిఫరెంట్ కథతో సినిమా చేస్తానని వారికి మాట ఇవ్వడం వలెనే వారు శ్రీను వైట్లని నమ్మరంటున్నారు.

'శ్రీమంతుడు, జనతా గ్యారేజ్' హిట్స్ ఇచ్చిన మైత్రి వాళ్ళు ఇప్పుడు 'సవ్యసాచి, రంగస్థలం' వంటి చిత్రాలను నిర్మిస్తున్నారు. మరి ఇలాంటి పెద్ద నిర్మాణ సంస్థ శ్రీనుకి ఛాన్స్ ఇవ్వడమే పెద్ద సెన్సేషన్. మరి కష్టాల్లో ఉన్నప్పుడు నమ్మి రవితేజ ఒక ఛాన్స్ ఇవ్వగా... మైత్రి వాళ్ళు కూడా శ్రీను ను నమ్మి ఈ సినిమా చేస్తున్నప్పుడు శ్రీను వైట్ల ఎలాంటి కథతో ఈసారి హిట్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడో చూద్దాం.

Similar News