త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ హీరోగా, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అ..ఆ'. 'అనసూయ రామలింగం వర్సెస్ ఆంద్ విహారి' అనేది క్యాప్షన్. కాగా ఈచిత్రం నితిన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈచిత్రం తొలి టీజర్ను హీరో నితిన్ జన్మదిన కానుకగా ఈనెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ మూడో వారంలో ఆడియో రిలీజ్ను ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈచిత్రానికి మిక్కి.జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈచిత్రాన్ని మేనెల 6వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంతో తాను 50కోట్ల క్లబ్ల చేరాలనే ఆశతో నితిన్ ఉన్నాడట. మరిఆయన కోరిక నెరవేరుతుందా? త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ కోరికను తీర్చగలడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈచితం బడ్జెట్ 35కోట్లకు చేరుకుందని సమాచారం.