యాత్ర షాక్ ఇచ్చిందిగా..!

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ బ‌యోపిక్స్‌ లో యాత్ర ఒక‌టి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మహి వి [more]

Update: 2019-02-04 06:21 GMT

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ బ‌యోపిక్స్‌ లో యాత్ర ఒక‌టి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మహి వి రాఘవ తెర‌కెక్కిస్తున్నాడు. ఫ్రిబవరీ 8న రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ కి ముందు షాక్ ఇచ్చింది. అది ఏంటంటే చిత్రం రన్ టైం. ఈ సినిమా కేవలం 126 నిమిషాల లెంగ్త్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాకు ప్లస్ కానున్న నిడివి

సాధారణంగా బ‌యోపిక్స్‌ అంటే ఎక్కువ రన్ టైం ఉంటాయి. మొన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు లెంగ్త్ 2 గంటల 56 నిముషాలు ఉంది. ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడానికి నిడివి కూడా కారణం. అందుకే యాత్ర మేకర్స్ రన్ టైం విషయంలో చాలా జాగ్రత్త పడ్డారు. కేవలం రెండు గంటల ఆరు నిమిషాల్లో సినిమాను పూర్తి చేసేస్తున్నారు. దీంతో ఈ సినిమాకి ఇది ప్లస్ కానుంది. ఇక ఈ సినిమా వైఎస్సార్ పాదయాత్రతో స్టార్ అవుతుందని సమాచారం.

Tags:    

Similar News