యాత్రకు ప్రభాస్ అండ..?

Update: 2018-06-29 07:34 GMT

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'యాత్ర'. 'ఆనందో బ్రహ్మ' సినిమా తీసిన మహి వి రాఘవ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లో స్టార్ట్ అయింది.

సింగిల్ షెడ్యూల్ లో...

షూటింగ్ లో మమ్ముట్టి పాల్గొంటున్నారు. ఇక ఈ సినిమా నిర్మాతల్లో ఒక్కరైన విజయ్ చిల్లాకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మంచి స్నేహితుడు. అందుకే ప్రభాస్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో తన వంతు సాయం చేస్తాడని మాటిచ్చాడంట. సినిమా మొత్తం సింగల్ షెడ్యూల్ లో ముగించనున్నారు. దాదాపు సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ ప్రవేశం నుండి సీఎం అయ్యి చేపట్టిన అన్ని అంశాలు ఇందులో చూపించనున్నారు. అంతే కాకుండా వైఎస్ 2003లో చేపట్టిన పాదయాత్ర హైలైట్ గా చూపించనున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా కంఫర్మ్ చేయలేదు.

Similar News