ఏమిటీ మౌనం!!

నెల రోజుల్ ముందు వరకు కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. మూడు నెలలు షూటింగ్స్ లేక అల్లాడిన సినిమా ఇండస్ట్రీ మళ్ళీ జూన్ [more]

Update: 2020-07-11 05:59 GMT

నెల రోజుల్ ముందు వరకు కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. మూడు నెలలు షూటింగ్స్ లేక అల్లాడిన సినిమా ఇండస్ట్రీ మళ్ళీ జూన్ 8 నుండి ఒక్కొక్కటిగా పట్టాలెక్కడానికి రెడీ అయ్యాయి. సినిమాల సంగతెలా ఉన్న సీరియల్స్ షూటింగ్ మాత్రం వరసబెట్టి సెట్స్ కెళ్ళిపోయాయి. కానీ సినిమా షూటింగ్స్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. సినిమా షూటింగ్స్ కోసం కంకణం కట్టుకుని గ్యాంగ్ ని వెంటేసుకుని తిరిగిన చిరంజీవి సైలెంట్ గా వేడుక చూడడం తప్ప ఏం చెయ్యడం లేదు. తలసాని తో తన ఇంట్లోనే నాగార్జున, దర్శకనిర్మాతలతో కలిసి మీటింగ్స్ పెట్టి.. పెద్దరికం నెత్తిన వేసుకుని మరీ ప్రభుత్వ అనుమతులు తెచ్చి ఇలా మౌనం గా ఉండడం అందరిని ఆశ్చర్యానికి కలగజేస్తుంది.

చిరు లాంటి పెద్ద మనిషే ఇలా మౌనంగా ఉంటే.. మిగతా వారు ఎలా డేర్ చేసి సెట్స్ మీదకెళ్తారు. కానీ చిరు మాత్రం షూటింగ్ గురించి ఆలోచించడం లేదు.. కరోనా గురించి మాట్లాడడము లేదు. బాలకృష్ణ చెప్పిందే జరుగుతుంది. ఇప్పట్లో సినిమా ఇండస్ట్రీ కోలుకోలేదని, ఇదివరికటిలా సినిమా ఇండస్ట్రీ ఉండదని.. చెప్పినట్లే జరుగుతుంది. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చూసినా చిరు పెదవి విప్పడం లేదు. కనీసం షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో.. పెద్ద సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకెళ్తాయో అనేది చర్చించడం లేదు. మొన్నటివరకు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల లాంటి దర్శకులతో మీటింగ్స్ పెట్టిన చిరు.. ఇప్పుడు మాత్రం ఎవ్వరిని కలవడం కూడా లేదు. మరి ఎందుకు ఈ మౌనం అంటూ చాలామంది చిరుని వేలెత్తి చూపించే పరిస్థితి వస్తుంది. చిరు అన్నీ గమనిస్తున్నాడో.. లేదంటే కరోనా కదా మనకెందుకులే అని సైలెంట్ అవుతున్నాడో.

Tags:    

Similar News