మరి కంగనా ఎందుకలా చెప్పింది!!

ప్రస్తుతం కంగనా సౌత్ లో అమ్మ జయలలిత బయోపిక్ తలైవిలో నటించడంతో హాట్ టాపిక్ గా నిలవగా.. మరోపక్క ముంబైలో తాను ఇష్టపడి కట్టించుకున్న ఆఫీస్ విషయంలోనూ [more]

Update: 2020-06-09 06:19 GMT

ప్రస్తుతం కంగనా సౌత్ లో అమ్మ జయలలిత బయోపిక్ తలైవిలో నటించడంతో హాట్ టాపిక్ గా నిలవగా.. మరోపక్క ముంబైలో తాను ఇష్టపడి కట్టించుకున్న ఆఫీస్ విషయంలోనూ హాట్ టాపిక్ గానే ఉంది. ముంబైలో కళ్ళు చెదిరే రీతిలో కంగనా తన ఆఫీస్ ని ప్లాస్టిక్ అనే పదం లేకుండా ఎకో ఫ్రెండ్లి గా తయారు చేసింది. అలాగే కంగనా రనౌత్ ఇప్పుడు దర్శకత్వంలోకి దిగబోతుంది అంటున్నారు. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా కరోనా కారణంగా థియేటర్స్ లో విడుదల కాకుండా ఓటిటిలోనే విడుదల కాబోతున్నట్టుగా అది కూడా అమెజాన్, నెట్ ఫ్లిక్స్లు తలైవి ఓటిటి హక్కులను 55 కోట్లకి కొనుగోలు చేసినట్టుగా చెప్పడమే కాదు.. నిర్మతలు కూడా తలైవి సినిమాని ఓటిటి కి అమ్మేసినట్లుగా.. ఇక థియేటర్స్ కన్నా ముందు తలైవి ఓటిటి లో రాబోతుందని ప్రచారం మాములుగా జరగలేదు.

అయితే కంగనా కూడా అలా చెప్పడంతో తలైవి ఓటిటిలో అని అందరూ ఫిక్స్ అయ్యారు. తాజాగా తలైవి యూనిట్ మాత్రం తలైవి ముందు థియేటర్స్ లోనే  విడుదలవుతుందని.. తర్వాతే ఓటిటిలో అంటున్నారు. తలైవి ఓటిటిలో విడుదల కాబోతుంది ఆనేది అబద్దమని యూనిట్ చెబుతున్న మాట. అసలు తలైవి సినిమా ఓటిటిలో విడుదలవడం అనేది అబద్దం, తలైవి  సినిమా థియేటర్స్ లోనే విడుదలకబోతుంది అని బాలీవుడ్ ప్రముఖ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ తో తలైవిపై అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. అయితే కంగనానే స్వయానా తలైవి ఓటిటిలో విడుదలకబోతుంది అని ఎందుకు చెప్పిందో ఇపుడు ఎవరికి ఆర్ధంకాని పరిస్థితి.

Tags:    

Similar News